Home » International News
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన వేళ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన విడుదల చేశారు. హోర్ముజ్ జలసంధిని మూసే ఉంచుతామని అన్నారు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో కీలకమైన హోర్ముజ్ జలమార్గం మూసివేయడం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్కు ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా దీటుగా స్పందిస్తోంది. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసి ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది
ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. అమెరికా-దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తరకొరియా మంగళవారం ఈ ప్రయోగాలు చేసింది. ఓ యుద్ధ నౌక నుంచి తన తీరానికి సమీపంలోని దీవులపై క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న థాయ్లాండ్ కార్గో షిప్పై క్షిపణి దాడి జరిగింది. ఒమన్ తీర ప్రాంతం సమీపంలో కార్గో షిప్ మయూరీ నారీని ఇరాన్ ప్రాజెక్టైల్ ఢీకొన్నట్టు థాయ్ అధికారులు తెలిపారు.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ మిలటరీ కమాండ్ తాజా హెచ్చరికలు చేసింది. ఇంతవరకూ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరుపుతున్న తమ దళాలు పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్కు సంబంధించిన ఆర్థిక, బ్యాంకింగ్ కేంద్రాలను టార్గెట్ చేయనున్నట్టు హెచ్చరించింది.
గల్ఫ్ ప్రాంతాల్లో భీకర యుద్ధం కొనసాగుతోంది. అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ పశ్చిమాసియా దేశాలపై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల్లో గాయపడినట్టు వచ్చిన వార్తలను ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ కుమారుడు యూసఫ్ పెజిష్కియాన్ బుధవారంనాడు ఒక ప్రకటనలో ఖండించారు. మొజ్తాబా ఆరోగ్యంతో, సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
హైదరాబాద్ నుంచి థాయిలాండ్ బయల్దేరిన ఎయిరిండియా విమానానికి (బోయింగ్ 737) ప్రమాదం తప్పింది. ఇవాళ(బుధవారం) ఫుకెట్ ఎయిర్ ఫోర్టులో ల్యాండ్ అయిన వెంటనే నోస్ వీల్ ఊడిపోయింది.
ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఖమేనీ వారసుడిగా, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా పదవీ బాధ్యతలు స్వీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.