Home » International News
గత నెలలో వెనెజువెలా వైపు వెళ్తున్న ఎం/వీ బెల్లా-1 నౌకను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా కోస్ట్ గార్డులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. రష్యా ఆ నౌకకు మద్దతుగా సబ్ మెరైన్, యుద్ధ నౌకను మెహరించింది.
అమెరికా సైనిక దళాలు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన అనంతరం రాజధాని కారకాస్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అమెరికా నిషేధించిన రెండు ఉగ్రవాద సంస్థలు ఒకేచోట సమవేశం కావడం సంచలనవుతుండగా, రెండు ఉగ్రవాద గ్రూపుల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది.
ఇరాన్లో ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. కుంటుపడుతున్న ఆర్థిక పరిస్థితిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.
వెనెజువెలా రాజధాని కారకాస్లోని అధ్యక్ష భవనం వద్ద భారీ కాల్పులు, పేలుళ్ల కలకలం రేగింది. అధ్యక్షుడు నికోలస్ మదురోను యూఎస్ భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తరువాత వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ ప్రమాణం స్వీకారం చేశారు.
ప్రత్యక్ష సాక్షులు, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం మార్కెట్కు వచ్చిన రాణాప్రతాప్పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
దాడి జరిగిన సమయంలో జేడీ వాన్స్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ దాడిలో ఆయన ఇంటి అద్దాలు పగిలాయి. వాన్స్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారా, వేరే కారణం ఏదైనా ఉందా అనే దానిపై విచారణ జరుగుతోంది.
వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడులు, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోని అదుపులోకి తీసుకున్న అంశం ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. రాత్రికి రాత్రే జరిగిన ఈ పరిణామంతో యావత్ ప్రపంచం షాక్ అయ్యింది. అయితే, ఈ ఆపరేషన్ గురించి ముందుగానే చెప్పారు షామన్లు.
దుండగులు గ్రామస్థులపై కాల్పులు జరపడంతో పాటు పలు ఇళ్లకు, స్థానిక మార్కెట్కు నిప్పుపెట్టినట్టు నైజర్ పోలీసు ప్రతినిధి ఒకరు చెప్పారు. మృతదేహాల వెలికితీత జరుగుతున్నందున మృతుల సంఖ్య 37కు పెరగవచ్చని గ్రామస్థులు చెబుతున్నారు.
'ఎక్స్'లో పోస్ట్ చేసే చట్ట విరుద్ధమైన కంటెంట్ను పూర్తిగా తొలగిస్తామని, అలాంటి కంటెంట్ను పోస్ట్ చేసిన అకౌంట్లను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని 'ఎక్స్' వెల్లడించింది. అందుకోసం అవసరమైతే స్థానిక ప్రభుత్వాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది