Home » ICC
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ టోర్నీలో ఎక్కువ శాతం మ్యాచులు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐకి చెందిన ఉమ్మడి తనిఖీ బృందం గురువారం ఈడెన్ గార్డెన్స్ను సందర్శించింది.
టీ20 ప్రపంచ కప్-2026లో తమ మ్యాచులను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. ఐసీసీని కోరిన విషయం విదితమే. అయితే.. బుధవారం జరిగిన అత్యవసర సమావేశంలో బీసీబీ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. ఐసీసీ నిర్ణయంపై తాజాగా బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందించారు.
భారత్లో టీ20 ప్రపంచ కప్ ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్ ఈ విషయంపై స్పందించాడు. ప్రపంచ కప్ ఆడటంపై తాము మాట్లాడటం సురక్షితం కాదని వెల్లడించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్లో బంగ్లా ఆడనున్న మ్యాచుల వేదికలను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి మెయిల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ.. బీసీబీకి ఈ విషయంపై డెడ్లైన్ విధించినట్లు సమాచారం.
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు తమ జట్టును ఇండియాకు పంపబోమని మొండి పట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో బిగ్ షాక్ తగిలింది. బీసీబీ తాజాగా చేసిన 'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను ఐర్లాండ్ తిరస్కరించింది.
భారత్-బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి ఐసీసీ తెరదించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు ఐసీసీ అధికారులు ఢాకా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు చెందిన ఓ అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించింది.
ఆదివారం వడోదర వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ అంపైర్ సర్ఫుద్దౌలా సైకత్ విధులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయంపై బీసీబీ తాజాగా స్పందించింది. అతడికి బీసీబీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
భద్రత కారణాల దృష్ట్యా రానున్న టీ20 ప్రపంచ కప్లో భారత్లో బంగ్లా ఆడనున్న మ్యాచ్ల వేదికలు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. బీసీబీ అభ్యర్థనను ఐసీసీ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ అంశంపై ఐసీసీ.. బంగ్లా క్రికెట్ బోర్డుకు ఓ కీలక సూచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ అసలు టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా? లేదా? అనే విషయంలో ఓ క్లారిటీ అంటూ లేదు. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ జట్టు సభ్యుడు, స్టార్ ఆల్రౌండర్ మహేదీ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బంగ్లా-భారత్ క్రికెట్ మధ్య జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఆ దేశ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశ క్రికెట్ భవిష్యత్, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవాలని బీసీబీని హెచ్చరించాడు. ఐసీసీ నుంచే అధిక శాతం నిధులు వస్తాయని గుర్తు చేశాడు.