Home » ICC
టీ20 ప్రపంచ కప్ 2026 వ్యూయర్ షిప్ పరంగా రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు భారత్లో దాదాపు 50 కోట్ల మంది ఈ మ్యాచులను వీక్షించినట్లు ఐసీసీ ఛైర్మన్ జై షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇదే రికార్డని వెల్లడించారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానాన్ని దక్కించుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన జాబితాలో 790 పాయింట్లతో టాప్ స్పాట్లో నిలిచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో స్మృతి ఓ హాఫ్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. మార్చి 4, 5 తేదీల్లో సెమీస్ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్లకు సంబంధించి మ్యాచ్ రెఫరీలు, అంపైర్లుగా ఎవరు వ్యవహరించనున్నారో తాజాగా ఐసీసీ వెల్లడించింది.
టీ20 వరల్డ్ కప్-2026 సూపర్-8 ఫార్మాట్పై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐసీసీ ప్రవేశపెట్టిన ప్రీ-సీడింగ్ విధానం వల్ల టోర్నీలో గ్రూప్ స్టేజ్లో టాపర్లుగా ఉన్న జట్లకు అన్యాయం జరుగుతోందని క్రీడా అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్ను ఐసీసీ తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అస్రాఫుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ మాయమాటలకు బీసీబీ చీఫ్ అమీనుల్ ఇస్లామ్ ప్రభావితమయ్యారని ఆరోపించారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్తో అదరగొడుతున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టాప్ 10లోకి దూసుకొచ్చాడు. 732 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు.
పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో సత్తా చాటింది. టీమిండియా స్టార్ క్రికెటర్ దీప్తి శర్మను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్ వన్ బౌలర్గా తిరిగి తన స్థానాన్ని సంపాదించుకుంది.
టీ20 ప్రపంచ కప్ 2026.. గ్రూప్ దశలోనే ఉత్కంఠ భరితమైన మ్యాచ్లు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. నేపాల్, నెదర్లాండ్స్, అమెరికా వంటి అసోసియేట్ జట్లు అసాధారణ ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడటంపై ఓ క్లారిటీ వచ్చింది. పాక్ ప్రధాని నిర్ణయం మేరకు యథావిథిగా మ్యాచ్ ఆడేందుకు పీసీబీ ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ధన్యవాదాలు తెలిపారు.
టీ20 ప్రపంచకప్-2026 నుంచి వైదొలగి చాలా పెద్ద తప్పు చేశామనే భావనలో బంగ్లాదేశ్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది. ఈ క్రమంలో బిగ్ రిలీఫ్ లభించింది.