Home » ICC
రాబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశాలు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ సమావేశాలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరవుతాడా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఆయన ప్రత్యక్షంగా అహ్మదాబాద్కు రావడం లేదని నివేదికలు వెల్లడించాయి.
రాబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశాలు భారత్లో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి అహ్మదాబాద్ వేదిక కానుంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరుపై మాత్రం సందిగ్ధత నెలకొంది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా పాయింట్ల కోతతో పాటు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో జరిమానా విధించింది.
వన్డే వార్షిక ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. భారత జట్టు 118 రేటింగ్ పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఘన విజయం సాధించిన టీమిండియా.. తాజా ర్యాంకింగ్స్లో తమ ఆధిపత్యాన్ని చాటింది.
టీ20 క్రికెట్ ఫార్మాట్ ఇటీవల కాలంలో పూర్తిగా మారిపోయింది. 20 ఓవర్లలోనే బ్యాటర్లు 250కి పైగా పరుగులు చేయగలుగుతున్నారు. బౌలర్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బ్యాటర్లను ఆపడం కష్టతరమవుతుంది. ఇదే విషయంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ.. 875 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
టీ20 క్రికెట్ ఫార్మాట్లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 ప్రపంచ కప్ను టీమిండియా ముద్దాడిన సంగతి తెలిసిందే.
ఐసీసీ తాజా వార్షిక టెస్టు ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. దీంట్లో ఆస్ట్రేలియా మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 131 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.
మహిళల టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ ప్రకటించింది. ప్రపంచ స్టార్ మహిళా టీ20 బ్యాటర్ స్మృతి మంధాన మరింత కిందకి వెళ్లింది. ఐసీసీ ప్రకటించిన జాబితాలో ఒక స్థానం కోల్పోయిన స్మృతి.. 747 పాయింట్లతో ఐదో ర్యాంకు సాధించింది.
దాదాపు 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్ను సగర్వంగా ముద్దాడిన క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ పట్టరాని ఆనందం కలుగుతోంది. అయితే ఆ జట్టులో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం తన కెరీర్లోనే పెద్ద నిరాశగా నిలిచిపోయింది.