Home » ICC
యాషెస్ సిరీస్లో భాగంగా ఆసీస్- ఇంగ్లండ్ జట్లు పెర్త్ వేదికగా తొలి టెస్టులో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఆట కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. తాజాగా పెర్త్ పిచ్కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్-5లోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియా సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మహిళల క్రికెట్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి మహిళల వన్డే ప్రపంచ కప్ 2029లో జట్ల సంఖ్య ఎనిమిది నుంచి పది పెంచాలని నిర్ణయించింది.
సాధారణంగా క్రికెట్ ఆటలో బ్యాటర్లు తరచుగా బౌలర్లను అయోమయానికి గురిచేయడానికి, ఫీల్డింగ్ సెటప్ను దెబ్బతీయడానికి వింత వింత షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా, కొందరు బ్యాటర్లు స్టంప్ల వెనుకకు, మరికొందరు పిచ్పై నుంచి పూర్తిగా పక్కకు జరిగి షాట్లు ఆడటం చేస్తుంటారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో శ్రీలంక, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ మ్యాచ్ ఫలితం టీమిండియాకు లాభాన్ని చేకూర్చింది.
మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం కొలంబోలో ఇండియాతో జరిగిన పోరులో పాకిస్తాన్ ఓపెనర్ సిద్రా అమీన్ చేసిన అతి ప్రవర్తన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆమె ప్రవర్తన లెవెల్ 1 నేరంగా గుర్తించబడింది.
IND vs NZ Final Match: ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్స్ మ్యాచ్లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. 23.2 ఓవర్లకే కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. నాలుగు వికెట్లు స్పిన్నర్లకే పడ్డాయి. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు. మ్యాచ్కు సంబంధించి బాల్ టు బాల్ ప్రతీ అప్డేట్.. ఆంధ్రజ్యోతి మీకోసం అందిస్తోంది.. అస్సలు మిస్ అవ్వకండి..
ఆగస్టు నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీల జాబితాలో భారత్ తరఫున మహ్మద్ సిరాజ్కు చోటు దక్కింది. ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అద్భుతంగా రాణించిన సిరాజ్ను ఐసీసీ నామినీగా ప్రకటించింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జూలై 20, 2025న నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కి సంబంధించిన అప్డేట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లార్డ్స్ టెస్ట్ ఐదో రోజు ఆటకు ముందు అతడికి షాక్ ఇచ్చింది ఐసీసీ. అసలేం జరిగిందంటే..