Home » Hyderabad
హైదరాబాద్ నగర శివారు గ్రామాల్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రభావం భూముల క్రయ విక్రయాలపై పడింది.
హైదరాబాద్లో ట్రాఫిక్జామ్కు చెక్ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్పాస్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం అయ్యాయి.
తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ భూముల అమ్మకాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భూముల అమ్మకాలపై ప్రశ్నలు సంధిస్తూ సీఎంకు హరీశ్ లేఖ రాశారు.
హైదరాబాద్లోని ఆస్మాన్ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా సవరణతో పాటు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను కూడా అధికారులు చేపట్టారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపించవద్దని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేసి అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నాలుగువారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీచేసింది.
హైకోర్టు స్టే ఆదేశాలను ఉల్లంఘించి ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన ఆరోపణలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై రాష్ట్ర హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ అభియోగాలు మోపింది.
పట్టణ గృహనిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో చేపట్టదలచిన ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణం విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అయిందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.