Home » Hyderabad
భోజనం విషయంలో గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. డ్రైవర్ను వంట మనిషి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆదివారం కోకాపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
గోదావరి పుష్కరాలు 2027పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
హైదరాబాద్లోని మెహిదీపట్నం ప్రాంతంలో పోలీసులపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మె్ల్యేలందరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నవభారత్ రన్ నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై.. రన్ను ప్రారంభించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్, కల్చరల్ మీట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు మంచి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.
జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారిణితో కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. కుక్క విషయంలో మొదలైన గోడవ చివరకు క్రీడాకారిణి కుటుంబానికి ప్రాణభయంగా మారింది. కొందరు మందుబాబులతో క్రీడాకారిణికి కుక్క విషయంలో గొడవ జరిగింది.
అంగన్వాడీ చిన్నారులకు అల్పాహారం అందించేందుకు 'తొలి ముద్ద' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వం ఉప్మా, కిచిడీ మిక్స్ను బ్రేక్ ఫాస్ట్గా అందించనుంది.
మైనింగ్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్పై ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.