Home » Hyderabad
శాలిబండ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షాపు ఓనర్ శివకుమార్ మరణించాడు.
ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో వయో పరిమితి అంశం రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. 28 ఏళ్లు దాటితే హాస్టల్ లేదని అధికారులు పేర్కొనడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ముగ్గురు మహిళలకు రోబోటిక్ విధానం ద్వారా శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సింగపూర్, దుబాయ్, భారత్ మహిళలకు గైనకాలజీ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. నగరంలోని కేర్ ఆస్పత్రి గైనకాలజీ బృందం ఈ శస్త్ర చికిత్సలను నిర్వహించారు.
మొత్తం 2,735 చ.కి.మీటర్లతో హైదరాబాద్ నగరం విస్తరించింది. హైదరాబాద్... ఇప్పుడు అతిపెద్ద నగరం. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని, అవతల గల 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు.
మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి మందలించడంతో.. మనస్థాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన సికింద్రాబాద్ హబ్సిగూడలో చోటుచేసుకుంది. సిరి వైష్ణవి(15) అనే బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే.. మార్కులు తక్కువగా వస్తుండడంతో తండ్రి మందలించాడు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
తాగునీటితో కారు కడిగిన వ్యక్తికి అధాకారులు రూ.10వేల జరిమానా విధించారు. ఈ విషయం బంజారాహిల్స్లో జరిగింది. తాగే నీటితో వాహనాలు కడగడం కొందరికి పరిపాటిగా మారింది. దీనిపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. జరిమానాలు విధిస్తున్నారు.
ఈనెల 27వతేదీన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుందని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరవుతారని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ నగర శివారులో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన కుర్ర పవన్ కళ్యాణ్రెడ్డి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. ప్రేమ విఫలమైందన్న కిరణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవి బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ద్వారా 20 కోట్ల రూపాయలు సంపాదించినట్లు సీసీఎస్ అడిషినల్ సీపీ శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఐబొమ్మ రవి కేసుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
9,292ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు రేవంత్ సర్కార్ యత్నిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్పనంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.