Home » Hyderabad
మూసీ నది అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ ఏ2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టనున్నారు అధికారులు.
హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి రవాణా విక్రయానికి పాల్పడుతున్న నెట్వర్క్ను పోలీసులు గుట్టురట్టు చేశారు. వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో 70 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
డాడీ నేను ఇక డాన్స్ లేయలేనా ? అన్న కుమారుడి మాటలకు ఓ తండ్రి చలించిపోయి బోరున విలపించాడు. సోమవారం పర్వతగిరి మండలం శ్రీనగర్ గ్రామ శివారులో పాఠశాల బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కొంకపాక గ్రామానికి చెందిన రాజు కుమారుడు హర్షిత్ (10) తీవ్రంగా గాయపడ్డాడు.
జలమండలి పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా విభజించింది.
తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్లకు తాజాగా కొత్త కమిషనర్లను నియమించింది..
బంజారాహిల్స్లో ప్రముఖ డిజైనర్ అనుశ్రీ రెడ్డి నిర్వహిస్తున్న డిజైనర్ స్టోర్లో చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో షూ ముద్రలు కీలకంగా మారాయి.
నగరంలో కేరళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఓ హోటల్లో రోడ్ షో నిర్వహించారు. ట్రావెల్ నౌ, పోస్ట్ లేటర్ పేరిట వినూత్న ప్రచారం నిర్వహించారు.
ప్రైవేటు అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలకు జేఎన్టీయూ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్ నెలలో ఎఫ్ఎ్ఫసీ తనిఖీలు షెడ్యూల్ చేయనుండగా, అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయా కళాశాలల యాజమాన్యాలకు వర్సిటీ ఉన్నతాధికారులు లేఖలు రాశారు.
గ్రేటర్ జోన్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కంటోన్మెంట్, మియాపూర్, రాణిగంజ్, హయత్నగర్, హెచ్సీయూ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు నడుస్తున్నాయి.
నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, సమ్మర్ డిమాండ్ మొదలైందని, వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు.