Home » Hyderabad City Police
వినాయక నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జనం స్థలాల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఆర్థిక కష్టాలతో ఉన్నా నిందితుడికి కుందేలు నిర్వహణకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి..? కుందేలుకు అనారోగ్యంగా ఉందని హడావిడి చేసిన నిందితుడు.. కుందేలును ఏ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు..? చనిపోయిన తర్వాత ఎక్కడ పాతిపెట్టాడనే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టే పనిలో పడ్డారు.
మహీంద్రా యూనివర్సిటీలో తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం వంటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.యాజులు మేడూరి స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన నార్కోటిక్స్ కేసులో తమ యూనివర్సిటీ విద్యార్థుల ప్రమేయం ఉందని వెలువడిన పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఖైరతాబాద్ గణేశ్ 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు మొదటి రోజు కావడంతో గణేశ్ వద్ద భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామంలో ఓ భార్య దాష్టీకానికి భర్త బలయ్యాడు. భార్య నాగలక్ష్మి ప్రియుడు మహేష్తో కలిసి భర్త హరిచరణ్ను హత్య చేసింది. నాగలక్ష్మి అదే గ్రామానికి చెందిన మహేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అపార్ట్మెంట్ ఓనర్ను హాస్టల్ యజమాని అమర్నాథ్ రెడ్డి చితకబాదాడు. అపార్ట్మెంట్లో తనకున్న 25 ప్లాట్లను హాస్టల్ నిర్వహించడానికి అద్దెకు ఇంటి యజమాని పిచ్చయ్య ఇచ్చాడు. కరోనాకు ముందు 25 ప్లాట్లను అద్దెకు ఇచ్చాడు.
గర్భిణి అయిన భార్య స్వాతిని ఆమె భర్త మహేందర్రెడ్డి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మేడిపల్లి బాలాజీహిల్స్లో జరిగింది. భార్య స్వాతిని చంపి మృతదేహాన్ని భర్త మహేందర్రెడ్డి ముక్కలు చేశాడు. తల, కాళ్లు, చేతులు వేరు చేసి భర్త మహేందర్రెడ్డి మూసీలో పడేశాడని డీసీపీ పద్మజారెడ్డి
ఈకో గణేశ్, గ్రీన్ గణేశ్ కాన్సెప్ట్ను ప్రోత్సహిస్తూ.. నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ చెప్పుకొచ్చింది. మట్టి వినాయక విగ్రహాల వాడకం ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు
పోలీస్ శాఖలో నకిలీ సర్టిఫికెట్లు వెల్కిరావడంతో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇలా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతమంది పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారో.. అనే అనుమానాలకు ఈ ఘటన తావిస్తోంది.