Home » High Court
బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి తెలంగాణలోని పలు కోర్టులు భారీశిక్షలను విధించాయి. వేర్వేరు కోర్టుల్లో నలుగురికి 20 ఏళ్లకు పైగా శిక్షలు వేశాయి.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణను గాలికి వదిలేశారని, చలాన్లు విధించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహిళా ప్రభుత్వ ఉద్యోగులు మూడో బిడ్డకు జన్మనిస్తే ప్రసూతి సెలవు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది.
గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై వివరణ ఇవ్వడంతోపాటు వాటిని నివారించేందుకు ఏయే చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది.
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు పచ్చజెండా ఊపడంతో వీటికి మోక్షం లభించే అవకాశం ఏర్పడింది. అయితే ఈ దరఖాస్తులను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖకు పలు సమస్యలు ఎదురయ్యేలా కనిపిస్తోంది.
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రావు పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కేసీఆర్, హరీష్రావు పేర్కొన్నారు.
నిరసనకారులు షరతులన్నింటినీ ఉల్లంఘించారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, ఆజాద్ మైదాన్లో ఉండటానికి బదులు సౌత్ ముంబైలోని అనేక కీలక ప్రాంతాల్లో గుమిగూడారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
సిటీ మొత్తం స్తంభించిపోతోందని, దక్షిణ ముంబైలోని కీలక ప్రాంతాలను నిరసనకారులతో నిండిపోతున్నాయని కోర్టు పేర్కొంది. కోటా నిరసలకు వ్యతిరేకంగా ఆర్మీ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖాడ్లతో కూడిన స్పెషల్ బెంచ్ ప్రత్యేక విచారణ జరిపింది.
ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు కేసీఆర్, హరీష్ రావు. అయితే, నిన్న విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం అదే బెంచ్లో లంచ్ మోషన్ పిటిషన్ వేసి విచారణ జరపాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు, ప్రభుత్వ గురుకులాలకు కోడిగుడ్ల సరఫరా కోసం జారీ చేసిన టెండర్లకు హైకోర్టులో మార్గం సుగమమైంది.