Home » Hero Vijay
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని, పాయిజన్ డీఎంకేని చిత్తుగా ఓడించడమే తమిళగ వెట్రికళగం (టీవీకే) ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ శపథం చేశారు. మదురై సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన పార్టీ ద్వితీయ మహానాడులో ఆయన ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. తమ పార్టీకి సైద్ధాంతికి శత్రువు బీజేపీ అని, రాజకీయ శత్రువు డీఎంకే అని ప్రకటించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని టీవీకే అధ్యక్షుడు, సినీ హీరో విజయ్(Vijay) ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజలతో కలిసిపోయి, వారితో మమేకమైన పార్టీగా వచ్చే ఎన్నికల్లో నిరూపించబోతున్నట్టు విజయ్ వెల్లడించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్కి విజ్ఞప్తి చేశారు. విజయ్ తనకు చిన్న తమ్ముడు లాంటివాడని, డీఎంకేను ఓడించేందుకు తమ కూటమిలో చేరాలని సూచించారు.
రాష్ట్రంలో 1967, 1977 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల తరహాలోనే 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుండబోతున్నాయని టీవీకే అధినేత విజయ్ జోస్యం చెప్పారు. యేళ్లతరబడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీలకు ఆ రెండు ఎన్నికలు గుణపాఠం చెప్పాయని, అదేవిధంగా రాబోవు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం ఘనవిజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించనుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ పతాకంలో ఎరుపు, పసుపు, ప్రత్యేక రంగుల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై, అఫిడివిట్ దాఖలు చేయాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్కు మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) జెండాలో రంగులపై మద్రాసు హైకోర్టులో కొత్తగా కేసు దాఖలైంది. తొండై మండల సన్నోర్ ధర్మ పరిపాలన సభ అధ్యక్షుడు పచ్చయప్పన్ మద్రాసు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లో... తొండై మండల సన్నోర్ ధర్మ పరిపాలన సభ తమిళనాడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విభాగంలో నమోదుచేసి ట్రస్ట్గా పనిచేస్తుందన్నారు. ఈ సభ జెండా ఎరుపు, పసుపు రంగులతో రూపొందించామన్నారు.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా ఎన్డీఏలో చేరిక గురించి టీవీకే నుంచి వచ్చే వార్త కోసం వేచిఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP state president Nainar Nagendran) పేర్కొన్నారు.
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, డీఎంకే పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) నిర్ణయింది.
డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నాడీఎంకే.. విజయ్ విషయంలో ఒక మెట్టు దిగిందా?.. ‘కలిసివుంటేనే కలదు సుఖం’ అన్న నానుడి చందాన ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండేందుకు టీవీకేతో పొత్తుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టిందా?.. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే విజయ్(Vijay)కు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిందా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
వచ్చే యేడాది జరుగనున్న ఎన్నికల గురించి ప్రస్తావించవద్దని, తనను ‘యువనేత కామరాజర్’ అంటూ తనపై పొగడ్తల వర్షం కురిపించకూడదని తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత, సినీ నటుడు విజయ్ విద్యార్థులకు హితవు పలికారు.