Home » Heavy Rains
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సహజసిద్ధంగా అందంతో మెరిసే కొండ ప్రాంతాలు, ఇప్పుడు వర్షాల విలయంలో చిక్కుకున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో వర్షాల కారణంగా అక్కడి ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఎడతెరిపి లేని వర్షాలతో అన్నదాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కోతకోసిన పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఖరీఫ్ ఆరంభానికి ముందే బారుబావుల కింద వేరుశనగ సాగుచేశారు. పంట కాలం పూర్తవడంతో వేరుశనగను తొలగించారు.
ఇప్పటికే.. హైదరాబాద్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన జారీ చేయడంతో నగరవాసులు ఉలిక్కి పడుతున్నారు.
హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం కాస్త ఎండగానే ఉన్నా.. సాయంత్రం మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
రాష్ట్ర,కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు రెండు రోజుల పాటు జరుగనుంది. మొదటి రోజు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే వర్షం పడుతోండటంతో పర్యటనను రద్దు చేసుకున్నారు.
నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, రసూల్పుర, సోమాజిగూడ, మల్కాజ్గిరి, కంటోన్మెంట్, తిరుమలగిరి, అల్వాల్లో వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణతో పాటు భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తోండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు భారీగా వరద నీరు వస్తోంది. మూసీకి కూడా బారీ స్థాయిలో వరదనీరు చేరడంతో భాగ్యనగరంలో మూసీ ఉగ్రరూపం దాల్చింది.