Home » Harmanpreet Kaur
India vs Australia: ప్రస్తుతం భారత మహిళల జట్టు మంచి ఫామ్లో ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత జట్టు టెస్టు ఫార్మాట్లో వరుసగా బలమైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను ఓడించింది. ఇదే ఊపులో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ20 సిరీస్ల్లోనూ సత్తా చాటాలని మన అమ్మాయిలు భావిస్తున్నారు.
Harmanpreet kaur: టీమిండియా ఉమెన్స్, ఆస్ట్రేలియా ఉమెన్స్ మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సహనం కోల్పోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంపైర్కు అప్పీల్కు చేసింది. అసలు ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 80వ ఓవర్ను హర్మన్ ప్రీత్ కౌర్ బౌలింగ్ చేసింది.
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో అలిస్సా హీలే నేతృత్వంలోని ఆసీస్పై 8 వికెట్ల తేడాతో హర్మన్ప్రీత్ కౌర్ సేన ఘన విజయం నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో అవసరమైన 75 పరుగులను రెండో ఇన్నింగ్స్లో కేవలం 2 వికెట్లు నష్టపోయి సునాయాసంగా సాధించింది.
ఆసియా క్రీడల్లో భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్ దశ నుంచి ఆడనున్నాయి.
టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ మంచి క్రీడాకారిణి అన్న మిథాలీ.. ఆమె యువ క్రీడాకారిణులకు రోల్ మోడల్ అన్నారు. కనుక వారంతా హర్మన్ప్రీత్ కౌర్ను అనుసరించాలని అనుకుంటారని, కాబటి మైదానంలో, మైదానం వెలుపల హర్మన్ ప్రీత్ కౌర్ గౌరవప్రదంగా నడుచుకోవాలని మిథాలీ సూచించారు.
టీమిండియా ఉమెన్స్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు 4 డిమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతోపాటు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించొచ్చు. మ్యాచ్ ఫీజ్ సంగతి పక్కనపెడితే డీమెరిట్ పాయింట్లు కనుక కేటాయిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ ఒకటి లేదా రెండు మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలున్నాయి.
బంగ్లాదేశ్తో శనివారం జరిగిన మూడో వన్డేలో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హర్మన్పై ఐసీసీ నియమావళి ప్రకారం చర్యలు ఉంటాయని క్రిక్ బజ్ ఓ కథనం ప్రచురించింది. ఇదే నిజమైతే హర్మన్ ఫీజులో 75 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశం ఉంది.
భారత విమెన్ క్రికెట్ జట్టు బాంగ్లాదేశ్ విమెన్ జట్టు మీద మూడో వన్ డే మ్యాచ్ లో టై చేసింది. అయితే ఈ మ్యాచ్ బాంగ్లాదేశ్ టై చేసింది కేవలం దయనీయమైన అంపైరింగ్ వల్ల అని భారత జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ విమర్శించింది. ఇంకోసారి బాంగ్లాదేశ్ కి పర్యటించడానికి వచ్చినప్పుడు క్రికెట్ తో పాటు ఇక్కడ అంపైరింగ్ కూడా దారుణంగా ఉంటుంది అని తెలిసి దానికి కూడా ప్రిపేర్ అయి రావాలని చెప్పింది.
బంగ్లాదేశ్ ఉమెన్స్తో జరిగిన కీలకమైన మూడో వన్డే మ్యాచ్లో భారత మహిళల గెలుపు ముంగిట బోల్తా పడ్డారు. ఒత్తిడిలో వరుసగా వికెట్లు చేజార్జుకున్న అమ్మాయిలు సునాయసంగా గెలిచే మ్యాచ్లో ‘టై’ తో గట్టెక్కారు. వర్షం అడ్డుపడడం కూడా భారత్కు ప్రతికూలంగా మారింది.
జెమిమా రోడ్రిగ్స్ ఆల్రౌండ్ షోతో దుమ్ములేపడంతో రెండో వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ మహిళలపై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. జెమిమాకు బ్యాటింగ్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బౌలింగ్లో దేవికా వైద్య సహకరించడంతో ఏకపక్షంగా సాగిన పోరులో బంగ్లాదేశ్పై టీమిండియా మహిళలు 108 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేశారు.