Home » Hardik Pandya
ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో వచ్చినప్పటి నుంచే హార్దిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి అతనికి అవమానాలే ఎదురవుతున్నాయి. ఇక కెప్టెన్గా జట్టుని సమర్థవంతంగా నడిపించడంలో విఫలమవుతుండటంతో.. ఆ విమర్శలు మరింత పెరిగాయి.
ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ ఎలా చెలరేగి ఆడాడో అందరికీ తెలుసు. చివరి ఓవర్లో మూడు సిక్స్లు బాది.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి తానొక గొప్ప ఫినిషర్ని అని నిరూపించుకున్నాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అటు అభిమానుల నుంచి ఇటు మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్లో ముంబై టీమ్ నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం స్వంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన రోజులివి. కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులే మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయ్. ఇందులో సాధారణ జనం..సెలెబ్రిటీలు అనే తేడానే లేదు. తాజాగా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. అతని సోదరుడు కృనాల్ పాండ్యా(Krunal Pandya) కూడా మోస పోయారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదటి రెండు మ్యాచ్ల్లో బౌలింగ్ వేశాడు కానీ, ఆ తర్వాతి రెండు మ్యాచ్ల్లో మాత్రం బంతిని ముట్టలేదు. ఒక్కటంటే ఒక్క ఓవర్ కూడా వేయలేదు. దీంతో.. హార్దిక్ ఎందుకు బౌలింగ్ వేయలేదన్న విషయం హాట్ టాపిక్గా మారింది.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్కు ఇప్పటివరకు ఏది కలిసిరాలేదు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకురావడం బెడిసికొచ్చింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఆశించిన మేర సత్తా చాటలేకపోతున్నాడు. దీనికి తోడు జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది.
ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ద్వేషిస్తున్నంతగా మరెవరిని ద్వేషించకపోవచ్చు. సోషల్ మీడియాలో, బయట హార్దిక్ పాండ్యాపై అనేక మంది క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్తిస్తున్నారు. హార్దిక్ పాండ్యాను హేళన చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. బౌలర్లు నామమాత్రంగా మారిన ఈ మ్యాచ్లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
ఐపీఎల్ 2024 సీజన్లో ఫస్ట్ మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ జట్టుపై చేధించలేకపోయింది. ముంబై జట్టు కొత్త కెప్టెన్ హర్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆట మీద దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అభిమానులు అయితే ఏకీపారేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దు మణిగేలా లేదు. కెప్టెన్సీ మార్పు జరిగి 3 నెలలు గడిచినా అభిమానుల ఆగ్రహావేశాలు మాత్రం ఇంకా చల్లారడం లేదు.