Home » Guntur
తమ ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ప్రైవేటు స్కూల్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో లక్షమంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో రెండో రోజు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ‘మన ఇల్లు - మన లోకేశ్’ పేరిట మంత్రి నారా లోకేశ్.. ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్లో రేపు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రలో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి డిమాండ్ చేశారు.
గుంటూరులో ఓ మహిళపై దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనను వారు తీవ్రంగా ఖండించారు.
గుంటూరులో ఓ మహిళపై దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించిందని తెలిపారు.
ఆధునీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.
పల్నాడు పౌరుషానికి శక్తివంతమైన ఆయుధమిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలని ఆకాంక్షించారు.