Home » Guntur
ఏపీ ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పాటిస్తూనే అసాంఘిక శక్తులు భయపడేలా పని చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టొద్దని హుకుం జారీ చేశారు.
ప్రజల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చు.. కానీ ప్రతిసారి మోసం చేయలేరని మాజీ సీఎం జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని పెమ్మసాని హితవు పలికారు. గుంటూరు, రాజధాని ప్రజలు బాగా తెలివిగల వారని తెలిపారు.
వైసీపీ హయాంలో ఎయిమ్స్కు నీళ్లు, రోడ్లు ఇవ్వలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ మహిళా కళాశాలను కూడా కాపాడలేని అసమర్థత జగన్ ప్రభుత్వానిదని పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు.
గుంటూరు జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి అఘోర చేసిన పూజలు.. ఆ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. బాబోయ్ క్షుద్రపూజలు అంటూ బెంబేలెత్తిపోతున్నారు.
ఆ మధ్య కాలంలో అటవీశాఖ రాష్ట్ర అధికారి ఒకరు హఠాత్తుగా మరణించారు. తాడేపల్లి(Tadepalli)లో ఆయన ఉండేది అద్దె ఇల్లు కావటంతో శవాన్ని అక్కడికి తీసుకురావద్దని ఇంటి యజమాని కరాఖండిగా చెప్పేశారు. దాంతో చేసేది లేక ఆయన భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులు గుంటూరు అటవీశాఖ కార్యాలయం వద్ద ఉంచి అక్కడ నుంచే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మద్యం బార్ల పాలసీ ఎక్సైజ్ అధికారు ల పాలిట శాపంలా మారిందా అంటే చోటుచేసుకుంటున్న పరిణామాలు అలాగే ఉంటున్నాయి. గతంలో మద్యం వ్యాపారం అంటే పెద్దఎత్తున పోటీ ఉండేది. ప్రభు త్వానికి దరఖాస్తుల రూపంలోనే రూ.కోట్ల తో ఖజానా నిండేది. గతంలో వైన్స్ లైసె న్సుల జారీలోనూ ఇదే పరిస్థితి. అయితే గత నెలలో బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా వ్యాపారుల నుంచి కనీస స్పం దన లేకుండా పోయింది.
గ్రామ పంచాయతీలకు 2024-25 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులను జనవరిలోనే కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రభుత్వం ఈ నిధులను పంచాయతీలకు విడుదల చేయకుండా తన ఖాతాలోనే ఉంచుకుంది.
గుంటూరులో నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత నైపుణ్య శిక్షణ ప్రారంభించారు. కేంద్ర ఉద్యోగాలు పొందేలా తాము ఇచ్చే శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా హితవు పలికారు.
వినాయక చవితిని అట్టహాసంగా జరుపుకోవాలని స్నేహితులతో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పూజకు అవసరమైన కలువ పూల కోసం వెళ్లి చెరువులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటనతో పండుగవేళ బుధవారం బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఇవాళ(బుధవారం) భారీ వర్షాలు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.