Home » Guntur
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ-2025 రిక్రూట్మెంట్పై తప్పుడు ప్రచారాలు జరుగుతుండటంపై సంబంధిత అధికారులు స్పందించారు. ఉద్యోగ నియామకాలపై అవాస్తవాలను తప్పుబడుతూ జీఏడీ, విద్యాశాఖ, క్రీడాశాఖల ఉన్నతాధికారులు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఎస్పీ (నాన్ క్యాడర్) అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్కు ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026’ పురస్కారం దక్కడం గర్వకారణమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ అవార్డు రాష్ట్రంలోని వ్యవసాయ రంగంలో సేవలందిస్తున్న అందరి సమిష్టి కృషికి లభించిన అంతర్జాతీయ గుర్తింపని ఆయన పేర్కొన్నారు.
ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులని పేర్కొన్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ డాక్యుమెంట్లతో దోచుకునేందుకు బ్రహ్మనాయుడు ప్రయత్నించారని ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా రష్యా పర్యటనకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో మంత్రి లోకేశ్ పర్యటించనున్నారు.
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి సంధ్యారాణి సాలూరులో పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఖరీఫ్-2026 సీజన్కు రైతులకు భారీ ఎత్తున రాయితీ విత్తనాల పంపిణీని ప్రారంభించారు.
డీఎస్సీ నిర్వహణపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో చేపట్టామని తెలిపారు.
టీడీపీ మహానాడుకు రికార్డు స్థాయిలో స్పందన లభించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 1875 క్లస్టర్ల ద్వారా వర్చువల్గా ఆరు లక్షల మంది కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నట్లు వెల్లడించారు.
మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంత్రి నారా లోకేష్కు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక ఫేక్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.