Home » Guntur
ఐదో రోజు పల్నాడు జిల్లాలో 144 సెక్షన కొనసాగింది. పోలీసులు పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత ప్రాంతాలు, ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
పల్నాడులో పోలింగ్, తదుపరి జరగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మంగళవారం జిల్లా అంతటా 144 సెక్షన్ విధించారు. అప్పటి నుంచి పట్టణాల్లో దుకాణాలను పోలీసులు తెరవనీయడంలేదు.
దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. ఘటనలపై ముందుస్తు సమాచారం ఉంది కదా.. ముందస్తు ఏం చర్యలు తీసుకున్నారు.. విధ్వంసం సృష్టిస్తున్న వారిని ఎందుకు అడ్డుకోలేకపోయారు.. అంటూ సిట్ బృందం పోలీసు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది.
రాష్ట్రంలో అతిపెద్ద పారిశ్రామిక జిల్లాల్లో ఒకటిగా వున్న గుంటూరు జిల్లాలో పారిశ్రామిక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా జిల్లాలో కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేకుండా పోయింది. పరిశ్రమాధిపతులపై అధికార వైసీపీ నేతల బెదిరింపులు, వేధింపులు, రాష్ట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యల కారణంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరూ జిల్లాలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రాలేదు.
గతంలో ఏ ఎన్నికల్లో లేని రీతిలో ఈ పర్యాయం మద్యం ఏరులై పారింది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే ఓటర్లను మత్తులో ముంచే ప్రయత్నం చేశారు. తమ పాలనతో ప్రజలు అన్ని రకాలుగా విసుగు చెందారని ముందుగానే గుర్తించిన వైసీపీ అభ్యర్థులు ఓటర్లకు అవేవీ గుర్తుండకుండా చేసేందుకు ప్రయత్నించినప్పటికీ మత్తు దిగగానే వారు తమ ప్రతాపం చూపించారు.
కళ్లెదుటే ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులు ఆక్రమించుకుని వ్యాపార స్థావరాలుగా మార్చుకుంటుంటే అధికారులు మిన్నకుంటున్నారు.
పట్టణంలోని పూలే కాలనీ వద్ద నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంటు ఏడేళ్లు అయినా పూర్తికాలేదు. 2017లో టీడీపీ ప్రభుత్వం పట్టణానికి ఈ ప్లాంటును మంజూరు చేసింది.
కొలంకపురి, వైకే నాటక కళా పరిషత్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటికలు సమాజాన్ని తట్టి లేపుతున్నాయి.
మండలంలోని తోండపిలో ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో అల్లర్లకు పాల్లపడిన ముగ్గురిపై కేసు నమోదుచేసి శనివారం అరెస్టు చేశామని ఎస్ఐ హజరతయ్య తెలిపారు.
మండలంలోని గుమ్మనంపాడు, అయ్యన్నపాలెం, గరికపాడు, పమిడిపాడు, మేళ్ళవాగు, రేమిడిచర్ల గ్రామాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.