Home » Guntakal
మండలంలోని మాల్యం ఉన్నత పాఠశాలలో 2005-06 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తరువాత ఆదివారం ఒకే చోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు చదువులు చెప్పిన ఆనాటి ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్, ప్రణవానంద, గోపాల్రెడ్డి, కృష్ణారెడ్డి, హరికృష్ణ, అమరవాణి, లక్ష్మీదేవి తదితరులను సన్మానించారు.
మండలంలోని ఓబులాపురం గ్రామశివారులో తోటలో పనులు చేసుకుంటుండగా రామాంజినమ్మ అనే వృద్ధురాలిపై అడవిపిల్లి దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రామాంజినమ్మ మరో మహిళతో కలిసి మడుగుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తమ అరటితోటలో కలుపు పనులు చేసుకుంటున్నారు.
మద్యం మత్తులో ఉన్న కేరళవాసి సంచారజాతుల వారు నివాసం ఉండే గుడారాల్లోకి దూరి హల్చల్ చేశాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అ ప్పగించారు. శనివారం రాత్రి మ ద్యం మత్తులో ఉన్న కేరళవాసి యాడికిలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, కొ త్త భాషలో మాట్లాడుతుండడంపై సా ్థనికులు అతడిని దొంగగా అనుమానించారు.
మండలంలోని కొట్టాలపల్లిలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఆదివారం పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడి, గ్రామంలో పలు సమస్యలపై ఆరాతీశారు. తాగునీరు వృథా చేయరాదని గ్రామస్థులకు సూచించారు.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అధికారులు, ఉపాధ్యాయులు విస్తృత ప్రచా రం నిర్వహిస్తున్నారు. అయితే పలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పా ఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తిప్పారెడ్డిపల్లి, కొట్టాలపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ఉన్నారు.
మండలంలో ఈ నెల 27, 28 తేదీలలో నిర్వహించే మహానాడు నిర్వహణపై గడేకల్లు గ్రామంలో క్టస్టర్-1 సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ విడపనకల్లు మండలంలో రెండు క్లస్టర్లు ఉన్నాయని, వాటి పరిధికి సంబంధించి గడేకల్లు, విడపనకల్లులో మహా నాడు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆపరేషన క్లీన స్వీప్ కా ర్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని నందలపా డు, సుం కులమ్మపాలెం, ఆసుపత్రిపాలెం తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగా హన కల్పించి, రోడ్లను శుభ్రం చేశారు.
పట్టణంలోని గంగా నగర్, హనుమేష్ నగర్లో శనివారం కలెక్టర్ ఒ. ఆనంద్ ఆకస్మీక తనిఖీ చేశారు. పట్టణంలోశనివారం నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ హాజరయ్యారు. ఆయనను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ మర్యాద పూర్యకంగా కలిశారు.
బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని వ్యాపారా లు సాగిస్తున్న చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సహకారంతో తాడిపత్రి టౌనబ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వాలని సంకల్పించినట్లు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేతో చర్చించామన్నారు. ఆయన శనివారం పట్టణంలోని మార్కెట్యార్డు నుంచి బస్టాండ్ వరకు మాజీ కౌన్సిలర్లు తదితరులతో కలిసి చిరువ్యాపారుల తో మాట్లాడుతూ బ్యాంకు రుణాలపై వారికి అవగాహన కల్పించారు.
మండలంలోని కరకముక్కల గ్రామంలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. పది తరగతు ల గదులూ పూర్తిగా శిథిలా వస్థకు చేరాయి. పై పెచ్చులు ఊడి పడుతూ ఉన్నా ఏ అధికారి పట్టిం చుకోవటం లేదు. గత ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింది రూ.1.5 కోట్లు నిధులతో ఊరి చివర నూతన పాఠశాల భవనం నిర్మాణం చేప ట్టారు.