Share News

COLLECTOR: వార్డుల్లో కలెక్టర్‌ తనిఖీ

ABN , Publish Date - May 24 , 2026 | 12:04 AM

పట్టణంలోని గంగా నగర్‌, హనుమేష్‌ నగర్‌లో శనివారం కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ ఆకస్మీక తనిఖీ చేశారు. పట్టణంలోశనివారం నిర్వహించిన రోజ్‌గార్‌ మేళా కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ హాజరయ్యారు. ఆయనను కలెక్టర్‌ ఆనంద్‌, ఎస్పీ జగదీష్‌ మర్యాద పూర్యకంగా కలిశారు.

COLLECTOR: వార్డుల్లో కలెక్టర్‌  తనిఖీ
Collector inquiring about details of vacant lots

గుంతకల్లు టౌన, మే23(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గంగా నగర్‌, హనుమేష్‌ నగర్‌లో శనివారం కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ ఆకస్మీక తనిఖీ చేశారు. పట్టణంలోశనివారం నిర్వహించిన రోజ్‌గార్‌ మేళా కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ హాజరయ్యారు. ఆయనను కలెక్టర్‌ ఆనంద్‌, ఎస్పీ జగదీష్‌ మర్యాద పూర్యకంగా కలిశారు. అనంతరం కలెక్టర్‌ స్ధానిక గంగానగర్‌, హను మేష్‌ నగర్‌లో పర్యటించారు. అక్కడ నివాసాల మధ ఉన్న ఓపెన సైట్‌, వేకెంట్‌ ల్యాండ్‌లను ఆయన పరిశీలించారు. ఆ స్థలాలను యజమానులు శుభ్రం చేసుకోవాలని లేని పక్షంలో వారికి జరిమానా వేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ లక్ష్మీదేవి, ఏఈ హరికృష్ణ, శానిటరీ ఇనస్పెక్టర్‌ రవి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 24 , 2026 | 12:06 AM