Home » GST Collections
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. గతంలో కాఫీ మీద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని రఘునందన్రావు గుర్తుచేశారు.
సాంకేతిక విధానాన్ని పరిపాలన పద్ధతుల్లో వినియోగించడంతో అవినీతికి ఆస్కారం ఉండదని కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. త్వరలో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పూర్తవుతుందని జితేందర్ సింగ్ తెలిపారు.
జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
జీఎస్టీ 2.0 సంస్కరణలతో 140 కోట్ల మందికి మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
జీఎస్టీ సంస్కరణలపై ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జిల్లా నుంచి గ్రామస్ధాయి వరకూ ఏఏ బెనిఫిట్స్ జీఎస్టీ సంస్కరణల ద్వారా అమలు అవుతాయో తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మార్కెట్పై జీఎస్టీ తగ్గింపు ప్రభావం స్పష్టగా కనిపిస్తుంది. ఈనెల 22నుంచి పలు వస్తువులుపై జీఎస్టీ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని మార్కెట్లపై ప్రభావం పడింది.
కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ టారిఫ్లను ప్రకటించటంతో ఓరుగల్లు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అనేక వస్తువులు, వాహనాలపై జీఎస్టీ భారం భారీగా తగ్గుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.