Home » GST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రులు, వివిధ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా జీఎస్టీ ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో కలిగే ప్రయోజనాలను పార్టీ శ్రేణులు ప్రజలకు తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు పిలుపునిచ్చారు.
ట్రంప్ తీసుకొచ్చిన హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు అమెరికా కంపెనీలపైనే అధిక భారాన్ని మోపుతోంది. ఇది.. ఏటా ఆయా కంపెనీలపై దాదాపు 14 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు ఉంటుందని చెబుతున్నారు.
జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
కొత్తగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (GST) సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ఇది స్థూల దేశీయోత్పత్తి (GDP)ని 0.8 శాతం వరకు పెంచగలవని..
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్స్ సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. దీని వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8వేల కోట్ల ప్రయోజనం ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. తెలుగులో విడుదల చేసిన జీవోల బుక్లెట్ను ముఖ్యమంత్రి..
ఇటీవల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచామని, దానితోపాటు ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల వల్ల దేశ ప్రజల పొదుపు రూ.2.5 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ చెప్పారు. భిన్న రకరకాల పన్నుల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించి, ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు.