Home » GHMC
పోలింగ్ రోజు కేంద్రాల్లో జరిగే విషయాలను పరిశీలించి సాధారణ పరిశీలకులకు నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూక్ష్మ పరిశీలకులకు సూచించారు.
ఎక్కడా వర్షం నీరు నిలవొద్దు.. ట్రాఫిక్ ఆగొద్దు అని అధికారులకు హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు సూచించారు. మొంథా తుపాను ప్రభావంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రమత్తమయ్యాయి. బుధవారం ఆయా సంస్థల కమిషనర్లు ఆర్వీ కర్ణన్, ఏవీ రంగనాథ్ పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ మ్యాన్హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి అధికారులు సూచించారు. ఎమర్జెన్సీ కోసం జలమండలి హెల్ప్ లైన్ 155313కి కాల్ చేయాలని ఆయన కోరారు. జంట జలాశయాల గేట్లు ఎత్తిన నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
నగర శివారు ప్రాంతాల్లో లేఅవుట్ల అభివృద్ధిపైనే హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఫోకస్ పెట్టింది. గతంలో ఇతర సంస్థలకు చెందిన భూములను సైతం అభివృద్ధి చేసి హెచ్ఎండీఏ విక్రయించింది. ప్రస్తుతం ప్లాట్ల ఈ-వేలం నుంచి హెచ్ఎండీఏ పూర్తిగా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి సొంతం చేసుకునే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. 2వేల చదరపు గజాల స్థలాన్ని శుక్రవారం కాపాడింది. దీని విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా పేర్కొంది.
గ్రేటర్ హైదరాబాద్లో మరో ఆరు స్కైవాక్లు రానున్నాయి. వీటిని వివిధ ప్రాంతాల్లో ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాలు రద్దీగా ఉండడం, పాదచారులు రోడ్డు దాట్టేందుకు ఇబ్బందులు పడడం, ఈ క్రమంలో ప్రమాదాలు, ట్రాఫిక్జామ్ అవుతున్నట్లుగా గుర్తించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం ఈవీఎంలు, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ పూర్తయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యవేక్షణలో గురువారం ర్యాండమైజేషన్ నిర్వహించారు.
అక్టోబర్ 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై నిలిచిపోనుంది. ఈ విషయాన్ని గమనించి ప్రజలు సరిపడా నీళ్లు నిల్వ చేసుకోవాలని అధికారులు కోరారు.
భాగ్యనగరంలో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించి మోసానికి పాల్పడ్డాడు అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. అధికారులకి అనుమానం వచ్చి కూపీలాగితే ఆయన డొంక కదిలింది.
ఉప ఎన్నికలో ప్రలోభాలను కట్టడి చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని, అనుమానిత లావాదేవీలపై నిఘా పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.