Home » Free Bus For Women
ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం వేదికగా ట్వీట్ చేశారు. మీ ఉచిత బస్సు టికెట్ తో సెల్ఫీ దిగి సాధికరత ఏంటో చూపించాలని మహిళలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళల ఉచిత బస్సులపై వైసీపీ రాద్ధాంతం మొదలుపెట్టేసింది. సూపర్ సిక్స్ పథకాలను అమలుచేయడం లేదంటూ ఇంతకాలం యాగీ చేశారు. ..
రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఇకనుంచి జీరో ఫేర్ టికెట్తో ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు...
రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పండుగ వాతావరణంలో ఆర్టీసీ బస్సులకు జెండా ఊపి ఆరంభించారు. మహిళలకు స్వయంగా ఉచిత టికెట్లు అందజేశారు. ...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న'స్త్రీ శక్తి' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఉండవల్లి గుహల నుంచి బస్సులో ప్రయాణిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించారు.
మహిళలకు ఉచిత బస్సు అమలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని మదనపల్లె-1, మదనపల్లె-2, పీలేరు, రాయచోటి, రాజంపేట డిపోల్లో అవసరమైన సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేశారు.
మహిళలు ఎదురుచూసిన వేళ రానే వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తికి ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకారం చుట్టనుంది. సాయంత్రం 5 గంటల నుంచి పథకాన్ని అమలు చేసేందుకు అనంత ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పల్లె వెలుగు, అల్ర్టా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో అనుమతించనున్నారు. ఆ మేరకు మహిళలు ...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విజయవాడ నగరం ముస్తాబవుతోంది. ఈ మేరకు పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
కూటమి ప్రభుత్వం మహిళలకు 15వ తేదీ శుక్రవారం నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఎలాంటి ఆటుపోట్లు ఎదురు కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కడప రీజియన్ పరిధిలోని బస్సులను పూర్తి సన్నద్ధం చేశామని ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు.
ఏపీవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. 'స్త్రీ శక్తి ' పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొంది.