Home » Fire Accident
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో ఉపయోగించిన కారు గురుగ్రామ్ ఆర్టీవో వద్ద రిజిస్ట్రర్ చేశారని కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు.
పఠాన్చెరు పారిశ్రామికవాడ రూప కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ(ఆదివారం) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు.
గ్రౌండ్ హ్యాండిలర్స్కు చెందిన బస్సు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుందని, అయితే ఏఆర్ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం రెండు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసిందని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో తెలియజేసింది.
గోడౌన్లో సీజ్ చేసిన లిక్కర్తో పాటు, రైల్వే షిప్పింగ్ మెటీరియల్ కూడా ఉందని డీఎఫ్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించని సీజ్ చేసిన మెటీరియల్ను కస్టమ్స్ అధికారులు గోడౌన్లో భద్రపరిచారని చెప్పారు.
బైక్పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరూ కలిసి డోన్కు వెళ్తుండగా.. ఇరువురిని బస్సు ఢీకొన్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ ఇవాళ తెల్లవారుజామున బస్సు బైకును ఢీ కొట్టి అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు ఎక్కడికక్కడ పూర్తిగా కాలిపోయింది. భగ్గున చెలరేగిన మంటలు క్షణాల్లో వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన మహిళ హైమారెడ్డి.. ఆ దృశ్యాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ(శక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ అగ్నిప్రమాదంలో బస్సులోనే పలువురు సజీవదహనం అయ్యారు.
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. ప్రమాద సమయంలో బస్సులోనే చాలామంది ప్రయాణికులు సజీవదహనం అవ్వడం అత్యంత విచారకరమన్నారు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సులో బుధవారం మంటలు చెలరేగాయి. నాదర్గుల్ బ్రాంచ్కి చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏసీ బస్సు లక్ష్మీగూడ వాంబే కాలనీ సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి.