Home » Farmers
మాజీ సీఎం కేసీఆర్ స్టైల్ వేరని.. ఇంట్లో కూర్చున్నా స్ట్రాటజిక్గా రాజకీయాలు చేస్తారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి ఏ ఆధారం లేకుండా కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగారని కొనియాడారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద ఎవ్వరినీ నొప్పించకుండా తాను పనిచేశానని చెప్పుకొచ్చారు.
రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వానాకాలం 2025-2026 సీజన్లో కందులకు ఎంఎస్పీ ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
పంటలకు యూరియా వాడటం వల్లే నష్టం కలుగుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. యూరియా వాడకం క్రమంగా తగ్గించాలని సూచించారు.
దేవుని పూజ కోసం ఇప్పటివరకూ ఇంటి పెరట్లో పెంచుకునే శంఖు పూల తీగలు ఇప్పుడు సిరులు కురిపించబోతున్నాయి. సహజ నీలం రంగు టీ, ఫుడ్ కలర్, టెక్స్టైల్ డైలకు డిమాండ్ పెరగడంతో మహిళా రైతులకు మంచి ఆదాయం, స్వావలంబన అవకాశాలు కలుగుతున్నాయి.
గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన జీవిత లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. దివంగత ఎన్టీఆర్ దీవెనలతో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లను చేపట్టాలని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటూ.. వారి సమస్యలను సకాలంలో పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. రైతులకు సంపూర్ణ భూ యాజమాన్య హక్కులని ప్రభుత్వం కల్పిస్తూ మీ భూమి - మీ హక్కు కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.
తెలంగాణలో అభివృద్ధి పనులు జరగడం లేదని.. అయిన సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయని ఆరోపణలు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే రీ సర్వే చేసి తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చామని ప్రస్తావించారు.
కొత్త సంవత్సర కానుకగా రాష్ట్రంలో 5 రకాల కేటగిరీలకు చెందిన భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగిస్లున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాత్ గురువారం ప్రకటించారు. కానీ, సుమారు ఏడాదిన్నరగా నానుస్తున్న ఫ్రీహోల్డ్ భూముల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి రెండు నెలలు ఇప్పటికే ఆరేడుసార్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో బాధిత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. పైస్థాయిలో ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.