Home » Farmers
కేంద్రప్రభుత్వం సహకరించకపోయినా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిందని పేర్కొన్నారు.
దేశంలో అన్నిరకాల పంటలను తమ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వరిధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ అండ్ కో పని అని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో బడుగువర్గాలపై దాడులు చేశారని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. యూరియా, సాగునీరు, కరెంట్ సరఫరా, పండిన పంట కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు. రైతులు ఇంత బాధపడటం మొట్టమొదటి సారి చూస్తున్నామన్నారు.
రేపటి నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ‘రైతు గోసా - బీజేపీ భరోసా’ పేరిట యాత్ర చేపట్టబోతున్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల వద్ద బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ యాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్ సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 8,575 కొనుగోలు కేంద్రాల నుంచి 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.
ద్రాక్ష తోటలు పెరగడానికి, రుచికరమైన వైన్ తయారీకి పచ్చని వాతావరణం, సమృద్ధిగా నీరు ఉండాలని అనుకుంటారు. కానీ, ఇజ్రాయెల్లోని ఎండలు మండిపోయే 'నెగెవ్' ఎడారి ఈ అంచనాలను తలకిందులు చేసింది. ఎడారిలో ప్రత్యేకమైన ద్రాక్ష తోటల పెంపకంతో అద్భుతమైన వైన్ను తయారు చేసి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నారు అక్కడి రైతులు.
ఏపీలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో రైతులు పొలాలను దుక్కి చేశారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రైతులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.