Home » Farmers
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం కలపర్రి గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ పరిసరాల్లోని కొండలు, పొలాల ప్రాంతంలో చిరుత కనిపించిందని తెలియడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు ఇచ్చే తెలివి లేదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.
అచ్యుతాపురం సెజ్కు ఐదువేల ఎకరాలు సేకరించారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రస్తావించారు. అప్పటి భూమి ధర ప్రకారం కాకుండా ఇప్పటి ధర ప్రకారం రైతన్నలు పరిహారం అడుగుతున్నారని తెలిపారు.
పప్పుశనగ ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు పెరగకపోవడంతోపాటు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పుచ్చకయల ధరలు చూసి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు ఆకాశాన్నంటాయి. ఈ సంవత్సరం వీటి సాగు విస్తీర్ణం తగ్గడంతో మంచి డిమాండ్ వచ్చింది.
టమాటా ధరలు కొద్ది రోజుల నుంచి రూ.2 నుంచి రూ.3లు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం వివిధ మార్కెట్లకు రైతులు తీసుకువస్తున్న టమాటాలు హోల్సేల్గా మాత్రమే ధర లభిస్తున్నది. దీంతో పెట్టుబడి కాదు కదా, కనీసం కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తానా సేవలు అభినందనీయమని తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు వ్యాఖ్యానించారు. తానా సంస్థ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు.
జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. వ్యవసాయంలో జాతీయ జీడీపీలో ఏపీకి పది శాతం వాటా ఉందని ప్రస్తావించారు.
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ పనులు పూర్తి అయ్యాయని జగన్ దొంగ మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు.