Home » Europe
ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలోని గిరోండ్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు భారీ విధ్వంసం సృష్టిస్తోంది.
ఐరోపాను కార్చిచ్చు భయపెడుతోంది. ఫ్రాన్స్లోని ప్రసిద్ధ ద్రాక్షతోటలు, వైన్ తయారీ కేంద్రాలకు పేరుగాంచిన బోర్డో నగరం వైపునకు మంటలు వేగంగా దూసుకొస్తున్నాయి. దాంతో పాటు పక్కనే ఉన్న స్పెయిన్ను కూడా ఈ మంటలు దహించివేస్తున్నాయి.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీలపై వరుసగా భారీ జరిమానాలు విధిస్తున్న యూరోపియన్ యూనియన్ వైఖరిపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. EUపై 'సెక్షన్ 301' కింద వాణిజ్య విచారణ ప్రారంభిస్తామని, భారీ స్థాయిలో టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, వాణిజ్య అనిశ్చితి, సరఫరా గొలుసు సమస్యలు కొనసాగుతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయితే యూరప్లో కీలక ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాత్రం ఇంతటి సంక్షోభ సమయంలోనూ ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది.
గత కొద్ది రోజులుగా యూరప్ దేశాలను భానుడు విలవిలలాడిస్తున్నాడు. ఎన్నడూ లేని అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూరప్ శీతల దేశాలు భగభగమంటున్నాయి.
యూరప్ నిప్పుల కొలిమిలా మారింది. ఇప్పటికే దాదాపు పదమూడు వందల మందికిపైగా ప్రజలు మరణించారు. పాఠశాలలు మూసివేశారు. విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.
ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో ఐరోపా ఖండం అల్లాడుతోంది. జూన్ 21 నుంచి ఇప్పటివరకూ భానుడి ప్రతాపానికి 1300 మందికి పైగా కన్నుమూశారు.
ప్రస్తుతం యూరప్ను అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యూరప్ శీతల దేశాలు భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నాయి.
భారత్-ఈయూ దేశాల మధ్య ఎఫ్టీఏపై ఈ ఏడాది డిసెంబర్ నాటికి సంతకాలు పూర్తయ్యే అవకాశమున్నట్టు కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని కూడా ఆయన తెలిపారు.
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిన నేపథ్యంలో... ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ పిలుపునిచ్చారు.