Home » Enforcement Directorate
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ కింద రూ.751.9 కోట్ల విలువచేసే ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులలో ఢిల్లీ, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌస్లు, లక్నోలోని నెహ్రూ భవన్ కూడా ఉన్నాయి.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆప్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సుప్రీంకోర్టు సోమవారంనాడు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తన రిమాండ్, అరెస్టును సవాలు చేస్తూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది.
Scam: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav), ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్(Tejaswi Yadav)తో సన్నిహిత సంబంధాలున్న వ్యాపారవేత్త అమిత్ కత్యాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ అరెస్టు చేసింది.
మనీ లాండరింగ్ కేసులో పంజాబ్లోని అమర్గఢ్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్ మాజరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అరెస్టు చేసింది. 60 ఏళ్ల గజ్జన్ మాజరాపై గత ఏడాది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.
రాజస్థాన్ లో సంచలనం సృష్టించిన జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈడీ(ED) దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏకకాలంలో రాష్ట్రంలోని 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejrival) ని అరెస్ట్ చేయడానికి బీజేపీ కుట్రపన్నుతోందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆరోపించారు. బుధవారం ఆమె కోల్కతా(Kolkata)లో మాట్లాడుతూ.. రానున్న రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో పాటు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార బీజేపీ ప్రతిపక్ష పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని అన్నారు.
మనీలాండరింగ్(Money Laundering) కేసులో జెట్ ఎయిర్వేస్కి(Jet Airways) చెందిన రూ.538 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కెనరా బ్యాంక్ లిఖిత పూర్వక ఫిర్యాదుతో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ(ED) విచారణ ప్రారంభించింది.
పశ్చిమ బెంగాల్(West Bengal) మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్(Jyoti Priya Mallick)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. రూ.కోట్ల విలువైన రేషన్ కుంభకోణంలో(ration distribution scam) మంత్రి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు.
కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష ఇండియా(INDIA Alliance) కూటమి సభ్యులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ఆరోపించారు.
మనీ లాండరింగ్ కేసుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసుల దర్యాప్తు సమయంలో ఈడీ ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడరాదని, పారదర్శకంగా, న్యాయంగా వ్యవహరించాలని సూచించింది.