Home » Eluru
ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడమే కాకుండా, పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుట్టాయగూడెం మండలం దొరమామిడిలోని జల్లేరు జలాశయంలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
ఏలూరు జిల్లా కైకలూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి మంత్రి టీజీ భరత్, స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో కలిసి ఘనంగా ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..
పిల్లల విక్రయాలపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. తమకు లభించిన ఆధారాల సహాయంతో ఈ కేసును పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
పోలవరం జిల్లాలో పులి సంచారం స్థానికుల్లో భయాందోళన కలిగిస్తోంది. రాజవొమ్మంగి రేంజ్ పరిధిలోని బోర్ణగూడెం అటవీ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. రూ.లక్షల వ్యయంతో 12,500 మంది ప్రజలకు రవాణా సౌకర్యం, రైతుల పంటలకు సులభతరంగా మారింది..
ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. రొయ్యల చెరువులో మేత వేసేందుకు వెళ్లిన తల్లి, కూతురు అనుకోని ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
ఏలూరు జిల్లాలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గురుకుల పాఠశాలలో టెన్త్ చదవుతున్న అజిత్.. హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం వద్ద పెద్దపులి సంచారం మొదలైంది. ఈ పులి రెండు లేగదూడలపై దాడి చేసి చంపింది. దీంతో ఇటుకల కోట ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనను గురవుతున్నారు.
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పందిరిమామిడి గూడెం ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.