Home » Elections
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆరు నెలల వరకూ తాము అడ్డుకోమంటూ ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు ఎన్నికలపై హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ స్పందించారు. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి పార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులో గెలుపొందిన విజయ్కి అభినందనలు తెలియజేశారు.
దేశంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలూ వెలువడ్డాయి.
తమిళనాడు, కేరళం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ మార్పును తమ తీర్పు ద్వారా స్పష్టంగా తెలియజేశారని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. దీంతో కమలం పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగా వెట్రి కజగం' పార్టీ అధినేత, నటుడు విజయ్ సత్తా చాటుతున్నారు. 100కు పైగా శాసనసభ సీట్లలో ముందంజలో ఉండడంపై విజయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు దశాబ్దం తర్వాత కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. దీంతో కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని సీఎం పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్లో ఎన్నో అరాచకాలు జరిగాయని.. బంగ్లా చొరబాటు దారులకు దారులు మూసుకుపోయాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశం అంతా బీజేపీని కోరుకుంటోందని ఉద్ఘాటించారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు జరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టు రాజకీయ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.