Home » Elections
‘ఆలూ లేదు.. చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉంది అన్నాడీఎంకే - బీజేపీ కార్యకర్తల తీరు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే కొందరు బీజేపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి నయినార్ నాగ్రేందన్ అంటూ ప్లెక్సీలు వేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
మరో ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే, మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి వచ్చే నెల 9న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలో టీడీపీ పోటీ చేయకుండా, బీజేపీకి సీటు వదిలివేయాలని నిర్ణయించింది
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం చేపట్టే స్థాయికి తీసుకెళతానని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈపీఎస్ నేతృత్వంలోని కూటమి మెజార్టీ స్థానాలు సాధించి అధికారం కైవసం చేసుకుంటుందని ఆయన అన్నారు.
లైసెన్స్డ్ తుపాకులు ఉన్నవారు వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లలో వాటిని అప్పగించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఆయప ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లైసెన్స్డ్ తుపాకులు అప్పగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Kishan Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని .. పోరాటాలకు సిద్ధం కావాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఎవరితోనూ పోటీ లేదని, అధికార డీఎంకే పార్టీతోనే తమకు పోటీ ఉంటుందని ఆయన పేర్కొనడం రాష్ర్ట వ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
యలమంచిలిలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. టీడీపీ కూటమి, వైసీపీ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. ఎన్నికల ప్రక్రియ రసాభాసగా మారింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ అస్వస్థతకు గురయి.. స్పృహ కోల్పోయి పడిపోయారు.
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠత నెలకొంది. గతంలో ఎంపీపీగా ఉన్న శాంతకుమారి మరణంతో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతోంది 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఒక్క ఎంపీటీసీ కూడా టీడీపీకి దక్కలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు.
తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత, ప్రముఖ హీరో విజయ్ ఒంటరిగానే మిగిలిపోనున్నారా.., వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరిగానే తలపడనున్నారా.. అనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అలా అయితే.. అతి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పావంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.