Home » Elections
ప్రశాంత్ కిషోర్ పార్టీ స్థాపించడానికి ముందు రెండేళ్లపాటు మహాత్మాగాంధీ సత్యాగ్రహం చేపట్టిన చంపరాన్ నుంచి రాష్ట్రంలో సుమారు 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు గత నెలలో ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. పిటీషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏడాదిన్నరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముగ్గురు నేతలను కోల్పోయింది. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నేతలు కావడంతో అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈనెల 8వ తేదీన అనారోగ్యంతో మృతిచెందారు.
డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నాడీఎంకే.. విజయ్ విషయంలో ఒక మెట్టు దిగిందా?.. ‘కలిసివుంటేనే కలదు సుఖం’ అన్న నానుడి చందాన ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండేందుకు టీవీకేతో పొత్తుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టిందా?.. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే విజయ్(Vijay)కు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిందా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. పిటీషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరిగిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల (Assembly By Election Results 2025) ఉపఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఈరోజు (జూన్ 23, 2025న) జరుగుతోంది. ఉదయం 8 గంటలకు గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలలో ఉపఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని క్రికెటర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మహ్మద్ అజారుద్దీన్ చెప్పారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి గెలిచిన సీట్ల కంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని మంత్రి కేఎన్ నెహ్రూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. రాష్ట్రంలో తుపాకి సంస్కృతి పెరిగిందని ప్రతిపక్ష నేత పళనిస్వామి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు రాష్ట్ర అసెంబ్లీ తమకు గెజిట్ పంపించిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆ గెజిట్ తాము యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని సీఈవో సుదర్శన్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు.. ఈసారి లోక్సభ ఎన్నికలతో కలిసి జమిలిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.