• Home » Elections

Elections

Telangana Local Body Elections: సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

Telangana Local Body Elections: సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసింది.

Case Against Rahul Gandhi: పాట్నాలో రాహుల్ గాంధీపై కేసు నమోదు..

Case Against Rahul Gandhi: పాట్నాలో రాహుల్ గాంధీపై కేసు నమోదు..

దర్భంగా జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని బీజేపీ నాయకుడు కృష్ణ సింగ్ కల్లు ఆరోపించారు. ప్రపంచంలో లేని వ్యక్తి గురించి దుర్భాషలు ఆడటం బాధాకరమన్నారు.

EC key Decision ON Jubilee Hills Bye Poll: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం

EC key Decision ON Jubilee Hills Bye Poll: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ఇవాళ(సోమవారం) సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా 79 పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. గతంలో 329 ఉన్న పోలింగ్ స్టేషన్లను 408కి పెంచనున్నామని ఆర్వీ కర్ణన్ వివరించారు.

Bihar: బిహార్ ఓటర్ల జాబితాలో ఇద్దరు పాకిస్థానీలు

Bihar: బిహార్ ఓటర్ల జాబితాలో ఇద్దరు పాకిస్థానీలు

హోం మంత్రిత్వ శాఖ విచారణ ప్రకారం, ఇమ్రానా ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానమ్‌లకు ఓటర్ కార్డులు జారీ అయ్యాయి. ఫిర్దోషియా 1956లో మూడు నెలల వీసాపై, ఇమ్రాన్ మూడేళ్ల వీసాపై భారత్‌కు వచ్చారు.

Jubilee Hills Bye Poll: జూబ్లీహిల్స్  బై ఎలక్షన్.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల

Jubilee Hills Bye Poll: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల

జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌‌పై ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సమావేశమయ్యారు.

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు విష ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు విష ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో హరిబాబు మాట్లాడారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓట్లు రిగ్గింగ్ చేశారంటూ అంబటి రాంబాబు తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేసిన అంబటిపై చర్యలు తీసుకొవాలని విజ్ఞప్తి చేశారు.

Ontimitta ZPTC Elections: వైసీపీని కుమ్మేసిన కూటమి.. రెండు స్థానాల్లోనూ విజయ కేతనం..

Ontimitta ZPTC Elections: వైసీపీని కుమ్మేసిన కూటమి.. రెండు స్థానాల్లోనూ విజయ కేతనం..

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డపై టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు నీరాజనం పట్టారు. 30 సంవత్సరాల తర్వాత పులివెందుల గడ్డపై టీడీపీ విజయ ఢంకా మోగించింది. అలాగే ఒంటిమిట్టలోనూ భారీ విజయం సొంతం చేసుకుంది.

BTech Ravi: నీ రప్పా రప్పా బ్యాచ్ ఏమైంది.. జగన్‌పై బీటెక్ రవి ధ్వజం

BTech Ravi: నీ రప్పా రప్పా బ్యాచ్ ఏమైంది.. జగన్‌పై బీటెక్ రవి ధ్వజం

పులివెందులలో గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను జగన్ భ్రష్టు పట్టించారని తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్‌చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కార్యకర్తలు జగన్‌ను పులివెందులలో బండబూతులు తిడుతున్నారని ఆరోపించారు. పులివెందులలో ఉహించిన దానికన్నా మెజార్టీ ఎ్కువ వచ్చిందని ఉద్ఘాటించారు. రీ పోలింగ్ అడిగింది వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డినేనని.. రీ పోలింగ్‌లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి పట్టం కట్టారని నొక్కిచెప్పారు.

Palla Srinivas Rao: జగన్ తన బుద్ధి మార్చుకోవాలి.. పల్లా శ్రీనివాస్ రావు ఫైర్

Palla Srinivas Rao: జగన్ తన బుద్ధి మార్చుకోవాలి.. పల్లా శ్రీనివాస్ రావు ఫైర్

జగన్‌ ఇప్పటికైనా రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు. నరకానికి ఎవరు వెళ్తారో జగన్‌కే తెలుస్తోందని విమర్శించారు. కల్తీ మందు అమ్మి ప్రజలు ప్రాణాలను బలిగొన్న జగన్ నరకానికి వెళ్తారని ఆక్షేపించారు. ఇప్పటికైనా జగన్ తన బుద్ధి మార్చుకోవాలని పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు.

CM Chandrababu Naidu: పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాలను ఎదిరించాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాలను ఎదిరించాం: సీఎం చంద్రబాబు

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి