Home » East Godavari
కాకినాడలోని పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా పడటంతో నీరంతా కలుషితంగా మారిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. కాల్వలో నీటిని శుభ్రం చేసే పనులు, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్చెరువు పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్ర నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులతో కూడిన రెండు బస్సులు, రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు..
తునిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ బర్త్డే పార్టీకి వెళ్లి వస్తున్న టీడీపీ నేతలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గోదారోళ్ల మర్యాదలు అంటే మామూలుగా ఉండవు మరి.. గోదావరి జిల్లాల ఆతిథ్యం గురించి వింటుంటేనే నోరూరిపోతుంది. కొత్త అల్లుడికి 70 రకాల వంటకాలతో కడియం మండలం జేగురుపాడులో జరిగిన ఈ విందు 'గోదావరి మర్యాద'కు అసలైన నిదర్శనంగా నిలిచింది.
ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన జగ్గన్నతోట ప్రభల ఉత్సవం అత్యంత వైభంగా జరుగనుంది. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఏపీలో కోడి పందేలు హోరాహోరీగా సాగుతున్నాయి. పందేల్లో భాగంగా లక్షల్లో చేతులు మారుతున్నట్లు సమాచారం. కోడిపందేలను వీక్షించేందుకు పెద్దఎత్తున జనం తరలివస్తున్నారు.
కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదంపై సమీక్ష జరిపిన సీఎం.. సర్వం కోల్పోయిన తండావాసులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు 'సై’ అంటుంటే పోలీసు అధికారులు మాత్రం 'నై' అంటున్నారు. అయినా షరా మామూలుగానే కోడి పందేలు, గుండాటలు, పేకాట పోటీల వంటివి నిర్వహించడానికి బహిరంగంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి..
పూరి నుంచి తిరుపతి వెళ్తున్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది రాజమండ్రి రైల్వేస్టేషన్లో రైలును నిలిపేశారు.