Home » East Godavari
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముక్కామల నడిపూడి మధ్య నేదునూరు పెదపాలెం వద్ద ప్రధాన పంట కాలువపై రిటర్నింగ్ వాల్ నిర్మించిన కాంట్రాక్టర్, ఆర్ అండ్ బి అధికారులపై అయినవిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో ఈనెల 22వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యారేజీని గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించి.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఖాతాదారులను మోసం చేసిన కాకినాడకు చెందిన ఆల్మైటి జెనిసెస్ సంస్థ డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలితాంబికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్లో వరుసగా మత్స్యకారుల బోటు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్ర తీరంలో ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎల్లయ్యపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు.
యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 2న కాకినాడ జిల్లా సర్పవరంలో రావణ్ను అరెస్ట్ చేసిన సమయంలో అతని మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మోకా లోవరాజు మృతి చెందాడు. కాట్రేనికోన గ్రామానికి చెందిన లోవరాజు గత రాత్రి బైక్పై వస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేరుతో నకిలీ టీటీడీ లేఖ కలకలం రేపుతోంది. టీటీడీ దర్శనం కోసం ఎమ్మెల్సీ లెటర్ హెడ్తో నకిలీ సిఫార్స్ లేఖ తయారు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది.
కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.