Home » East Godavari
'పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు' అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని.. టీడీపీ శ్రేణులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి ఇంటికీ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించారు.
ఖరీఫ్ సీజన్కు సాగునీటి సరఫరాపై తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
పోలవరం అడవుల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. పులి కదలికలపై 24 గంటల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
గోదావరి నదిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పరిశ్రమలు వ్యర్థాలను గోదావరిలో కలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు(మంగళవారం) ఉదయం రాజమండ్రి రూరల్ మండలం వెంకట్ నగరం గ్రామంలో ఆంధ్రా పేపర్ మిల్లు వ్యర్థ జలాలు కలుస్తున్న లంకలను పరిశీలించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 216వ జాతీయ రహదారి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.
కాకినాడ రూరల్ మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతల్లో ఆ పార్టీ హై కమాండ్ మార్పు చేసింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, యానాం రీజెన్సీ గ్రూపు ఆఫ్ కంపెనీస్ అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు(87) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.