Home » East Godavari
దాదాపు 6 వేల మందిని తరలించేందుకు 120 పునరావాసు కేంద్రాలు ఏర్పాటు చేవారు. అమలాపురం, సఖినేటిపల్లిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.
కాకినాడ వైపు మొంథా తుఫాన్ ముంచుకొస్తోంది. ప్రచండ వేగంతో కదులుతూ తీరం వైపు దూసుకొస్తోంది. కాకినాడ పోర్టు - తుని మధ్య మంగళవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సోమ, మంగళ, బుధవారం మూడు రోజులపాటు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్పించి ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది.
గురుకుల పాఠశాలకు వచ్చిన నారాయణ... బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆపై బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. స్థానికులు గమనించి నిలదీయగా అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు.
కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులు శైవ క్షేత్రాలకు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
బంగారం, వెండిపై మోజు పెరిగే కొద్దీ వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు వినియోగదా రులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. అదే బాటలో వెండి సైతం రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం మార్కెట్లో కిలో వెండి ధర అనూహ్యంగా పెరిగి రూ.1,72,000కు చేరింది. ఈ ఏడాది జనవరిలో వెండి ధర రూ.88,400 మాత్రమే. ఈ తొమ్మిది నెలల పదిరోజుల్లో ఏకంగా రెట్టింపు అయింది. త్వరలో కిలో వెండి రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉన్న
కోనసీమ జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అర్హులైన డ్రైవర్లందరికీ ఏడాదికి 15వేల చొప్పున ఆర్దిక సాయం అందజేస్తామన్నారు.
ఐదేళ్ల పాటు నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి 50 వేల కోట్ల పంట నష్టానికి కారణమై చరిత్ర హీనుడిగా నిలిచారని మంత్రి నిమ్మల అన్నారు. జగన్ ఆల్మట్టి గురించి ఇప్పుడు ఆందోళన చెందటం దెయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ సెటైర్ విసిరారు.
అల్లూరి జిల్లా విలీన మండలాల్లో రహదారులపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వీఆర్ పురం మండలాల పరిధిలో 40 లోతట్టు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి.
మిర్చి పంట వరద నీటిలో మురిగిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ కాజ్ వేలు, రహదారులు నీటమునిగాయి.