Home » DMK
తమ పార్టీలో పదవులు అనుభవించి, అవసరం తీరాక డీఎంకేలో చేరేవారంతా వలసపక్షులేనని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’అనే నినాదంతో గత నెల 7వ తేదీ కోవై జిల్లా మేట్టుపాళయంలో ప్రారంభిమైన ఈపీఎస్ ప్రచారయాత్ర బుధవారం తిరుపత్తూరుకు చేరుకుంది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్ వెలువడక ముందే ఓటర్ల జాబితాను ఎలాంటి అవకతవకలు లేకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా సవరించాలే తప్ప, బిహార్ తరహా సవరణ చేయకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం డిమాండ్ చేసింది.
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి తుడిచిపెట్టుకుపోతుందన్న భయంతో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ నోరు తిరగని పేర్లతో కొత్త పథకాలను ప్రారంభిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ధ్వజమెత్తారు.
కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిని అసెంబ్లీ స్పీకర్ అప్పావు తప్పుబట్టారు. పూర్తి అధికారం పార్లమెంట్కే ఉందని ఎన్నికల సంఘానికి లేదన్నారు. ఆయన తిరునెల్వేలిలో మీడియాతో మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తే, అది అబద్ధమని నిరూపించకుండానే ఆ వ్యక్తిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం తప్పన్నారు.
పదేళ్ల అన్నాడీఎంకే పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అథఃపాతాళానికి చేరిందని, గత నాలుగేళ్ల డీఎంకే ద్రావిడ తరహా పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి పురోగమించినట్లు కేంద్రప్రభుత్వమే ప్రకటించిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి తమకు బాగా తెలుసని అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎద్దేవా చేశారు. డీఎంకే పాలనలో అన్ని రంగాల్లో కుంటుపడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
పార్లమెంటు ఉభయ సభలను మంగళవారం నిరవధికంగా వాయిదా వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది
ప్రభుత్వాలు జారీ చేసే ప్రకటనల్లో ప్రధాని, ముఖ్యమంత్రుల ఫొటోలు పెట్టడం సర్వసాధారణమేనని..
బీసీ రిజర్వేషన్లు 42 శాతం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు డీఎంకే ఎంపీ కనిమొళి మద్దతు తెలిపారు. రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలని కనిమొళి డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నీ డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా స్టిక్కర్లు వేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, నటి ఖుష్బూ ఆరోపించారు.