Home » DMK
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారంనాడు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల స్టేట్ రన్ లిక్కర్ కార్పొరేషన్ 'టాస్మాక్ ' కార్యాలయంపై ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో స్టాలిన్ ఢిల్లీ పర్యటన చేపట్టారని విపక్ష అన్నాడీఎంకే ఆరోపించింది.
మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి తథ్యం అని మాజీమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయ్కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యధిక స్థానాల్లో అన్నాడీఎంకే పార్టీ గెలవడం ఖాయమని ఆయన అన్నారు.
అగ్ర హీరో విజయ్ ఏర్పాటుచేసిన టీవీకే పార్టీ విజయావకాశాలపై మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడా పళనిస్వామి రహస్య సర్వే జరిపించారనే వార్తలు వస్తున్నాయి. మరో ఏడాదిలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవగా.. హీరో విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ ప్రభావం ఎంత అన్నదానిపైనా చర్చ జరుగుతోంది.
నో డౌట్.. రాసిపెట్టుకోండి.. మరో పదేళ్లు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు.. అంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే ద్రావిడ తరహా పాలనపై ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని స్టాలిన్ అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ కూటమితో మాకేం నష్టం లేదు.. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చానీయాంశమైంది. అన్నాడీఎంకే, బీజేపీ వంటి ప్రధాన పార్టీలతోపాటు మరికొన్ని పార్టీలు జట్టుకట్టి మరో ఏడాదాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఊటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు రోజులు ఊటీలోనే ఉండనున్నారు. చెన్నై నుంచి కోవై విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా.. ఊటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు పంపిణీ చేస్తారు.
సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే ఉంటా... అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాట పెద్ద వివాదమే ఏర్పడింది. ఉదయనిధిపై కేసుల నమోదు వరకు వెళ్లింది. కాగా... ఆ కేసు విచారణ ఆగస్టుకు వాయిదా పడింది.
మా ఓటమి కోసం ప్రతిపక్ష పార్టీలు తపిస్తున్నాయని, కానీ... వారు అనుకున్నట్లు అలాంటిదేమీ జరగబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. వారు ఎన్ని ప్రయోగాలు చేసినా.. ప్రజలు తమవైపే ఉన్నారన్నారు. అంతేగాక.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు.
నీట్ వ్యవహారంపై విద్యార్ధులకు ముఖ్యమంత్రి స్టాలిన్ క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నాడీఎంకే పార్టీ పేర్కొంది. ఈ సందర్బంగా అధికార డీఎంకే పార్టీ 525 హామీలు ఇచ్చిందని, వాటిలో 15 శాతం కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు అంటూ పేర్కొన్నారు. 2026లో జరిగే ఎన్నికల్లో ఒకే వెర్షన్ మాత్రమేనని, అది రాష్ట్రంలో అన్నాడీఎంకే వెర్షన్ మాత్రమేనని ఈపీఎస్ తెలిపారు.