Home » Dharmavaram
పట్టణ సమీపంలోని పుట్టపర్తికి వెళ్లే రహదారిలో తుంపర్తికాలనీ వద్ద రోడ్డుపై పడిన గుంతలతో వాహన దారులు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. మోటుమర్ల వద్ద నుంచి తుంపర్తి కాలనీ వరకు ఈ రోడ్డు గుంతలుపడి అధ్వానంగా తయారైంది.
మండలంలోని చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు తాడిమర్రి చెన్నారెడ్డి సాగుచేసిన అరటిచెట్లు గాలివానకు నేలకొరిగి రైతుకు తీవ్రనష్టం వాటిల్లింది. రైతు చెన్నారెడ్డి మాట్లాడుతూ... తన మూడెకరాల్లో సుమారు 3వేలకు పైగా అరటిచెట్లు సాగుచేశానన్నారు. పది నెలలుగా కంటిరెప్పలా రేయింబవళ్లు శ్రమించి తెగుళ్లు రాకుండా చెట్లను కాపాడానన్నారు.
మండల కేంద్రలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో పలు భవనాలు శిథిలావస్దకు చేరి ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిని తొలగించేది ఎప్పుడని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల ఆవరణంలో గతంలో నిర్మించిన పురాతన భవనాలు చాలా ఏళ్లు గడవడంతో పైకప్పు పెచ్చులూడి, గోడలు నెర్రలు చీలి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి.
తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వార్డు సచివాలయ ఉద్యోగులు మున్సి పల్ కార్యాలయ మేనేజర్ రాజేశ్వరికి విన్నవించారు. వారు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశా రు.
గడ్డిమందు పిచికారి చేయడంతో మండలంలోని చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు సాయినాథ్ రెడ్డి మూడెకరాల్లో సాగుచేసిన వేరుశనగ పంట ఎండిపోయింది. దీనిపై బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘ముంచిన గడ్డిమందు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన మండల వ్యవసా యాధికారి ముస్తఫా సిబ్బందితో కలిసి రైతుపొలాన్ని పరిశీలించారు.
వర్షపు నీటిని సద్వినియోగం చేసు కోవాలనే లక్ష్యంతో నిర్మిం చిన చెక్ డ్యాంలు ప్రస్తు తం నిరుపయోగంగా మా రాయి. వాటర్ షెడ్ ప థకం కింద ఉమ్మడి అనం తపురం జిల్లాలో ప్రధా న వాగులపై మొత్తం 3,326 చెక్ డ్యాములను, వంకల్లో 1600 చెక్ వాల్స్ నిర్మించారు. కొన్ని ఇరిగేషన శాఖ ఆధ్వర్యంలో నిర్మించగా, మరికొన్నింటిని ఆర్డీటీ నిధులతో కట్టించారు.
మండలంలోని ధర్మవరం- అనంతపురం రహదారిలో చిగిచెర్ల సమీపంలోని మలుపు ప్రమాదకరంగా మారింది. చిగిచెర్ల విద్యుత సబ్స్టేషన ముందుభాగంలో రోడ్డు మలుపువద్ద కంపచెట్లు ఏపుగా పెరగడంతో రోడ్డు కని పించక తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
వాల్మీకులను ఎస్టీ జాబి తాలోకి చేర్చాలంటూ మొదలైన పోరాటానికి మొదట మద్దతు పలికింది పరిటాల కుటుంబమే అని టీడీపీ నియోజకవర్గ ఇన చా ర్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్లో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కోసం మండపం ని ర్మాణానికి ఆ యన మంగళవారం భూమిపూజ చేశారు.
పట్టణంలోని లక్ష్మీచెన్నకేశ వస్వామి ఆలయంలో గరు డ పౌర్ణమి సేవా కార్యక్రమా న్ని వైభవంగా నిర్వహించా రు. మంగళవారం పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ వా హనంపై స్వామివారిని ఆశీ నులు చేసి పురవీధుల్లో ఊ రేగించారు.
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన దుర్గ మ్మ విగ్రహాన్ని శనివారం సంఘమేశ్వరం చెరువులో నిమజ్జనం చేశారు. పట్టణంలోని స్వయంభూ కాలబైరవస్వామి ఆలయంలో దసరా ఉత్సవా లను ఘనంగా నిర్వహించారు.