Home » Dharmavaram
మండల కేంద్రంలో ప్రబోధానంద సేవా సమితి, త్రైత సిద్ధాంతం సభ్యుల ఆఽధ్వర్యం శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్ షెల్టర్లో శ్రీకృ ష్ణాష్టమి సందర్భంగా ఈ నెల 16న కృష్ణుడి ప్రతిమను ఏర్పాటు చేసి నాలుగు రోజులు ప్రత్యేక పూజలు చేశారు. ఐదో రోజు బుధ వారం శ్రీకృష్ణుడి ప్రతిమను పల్లకిలో ఉంచి గ్రామోత్సవం నిర్వ హించారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని డీఎస్పీ హేమంతకుమార్ పేర్కొ న్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ జన్మ దినం సందర్భంగా బుధవారం ఆర్డీటీ స్థానిక క్రీడామైదానంలో అ టల్ బిహారీ వాజ్పేయి స్మారక సీజన-2 క్రికెట్ టోర్నీని ప్రారంభిం చారు.
తమ గ్రామాలకు వెళ్లే రహదారుల్లో ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉందని మండలం లోని పలు గ్రామప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మ ల్లాకాల్వ, దర్శినమల, ఓబుళనాయునిపల్లి, నేలకోట, ఏలుకుంట్ల తదితర గ్రామాల నుంచి ధర్మవరానికి వెళ్లే రహదారి చాలా ఆధ్వానంగా తయా రైంది.
మండల కేంద్రం లోని బు క్కపట్నం రహదారి సమీపం లో ఉన్న నల్లమ్మ ఆ లయం మలుపులో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు, ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఏమీ కాలేదు. ఆ మ లుపులో ఇరు వాహనాల డ్రైవర్లు హారన కొట్టకుండా ఎదురెదు రుగా వచ్చారు. అయితే ఇరువురూ సడన బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో విద్యార్థులు భయపడి కేకలు వేశారు.
క్రీడల్లో ప్రతిభ చాటే విద్యార్థులకు తన వంతు సహాయ స హకారాలు అందిస్తా నని టీడీపీ నియో జకవర్గ ఇనచార్జ్ పరి టాల శ్రీరామ్ పేర్కొ న్నారు. ఒంగోలులో ఈనెల 17న జరిగిన 43వ యానివర్సిరీ ఆలిండి యా ఓపెన కరాటే చాంపియన షిప్లో ప్రతిభచాటిన ధర్మవరం విద్యా ర్థులను ఆయన మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అభినందించారు.
ఎన్నోఏళ్లుగా పింఛన్లు పొందుతున్నామని, అన్ని అర్హతలు ఉన్న తమకు ప్రస్తుత వెరిఫికేషనలో నిలిపి వేశారని పలువురు దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు పింఛ న్లు పునరుద్ధరించాలని కోరారు. ఈ మేర కు వారు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఫించన్లు రాకుంటే తాము ఇబ్బం దులు పడాల్సి వస్తుందని వాపోయారు.
పట్టు ఉత్పత్తిని పెంచి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేద్దామని అనంతపురం ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమ్య తెలిపారు. మండలంలోని రేగాటిపల్లిలో మంగళవారం ‘నా పట్టు-నా అభిమానం’ అనే ప్ర చార కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. శ్రీసత్యసాయి జిల్లా జా యింట్ డైరెక్టర్ శోభారాణి, ఏడీ అప్పలనాయుడు హాజరయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిం చడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సత్యకుమార్ సతిమణి త్రివేణి పేర్కొన్నారు. మంత్రి సత్యకుమార్యాదవ్ చొరవతో సం స్కృతి సేవాసంస్థ ఆధ్వర్యంలో, హిందూస్థాన కోకాకోలా బేవరేజేస్ కార్పెరేట్ సంస్థ సహకాంతో సీఎస్ఆర్ నిధుల ద్వారా పలు పా ఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన టాయిలెట్లను ఆమె సోమవారం ప్రారంభించారు.
మండల కేంద్రంలోని బసవన్న కట్ట వీధి, పెద్దమసీదు ప్రాంతాల్లో 15 రోజుల నుంచి తాగునీరు సరఫరా కాలేదం టూ ఆ ప్రాంత మహిళలు సోమవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ధ ర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.... తమ ప్రాంతానికి 15 రోజలుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని చిగిచెర్ల గ్రామంలో సోమవారం పలుదేవతా విగ్రహాల ప్రతిష్ఠను గ్రామపెద్దలు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వినాయ కుడు, నాగదేవతలు, నవగ్రహాలు, ఉమామహేశ్వర విగ్రహాల నుప్రతిష్ఠించారు. వేదపండితుల ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ఠ, ప్రా ణప్రతిష్ఠ అనంతరం పుర్ణాహుతి సమర్పించారు.