Home » Dharmavaram
తమ గ్రామాలను మున్సిపాలిటీలోకి విలీనం చేస్తే ము న్సిపాలిటీ విఽధించే పన్నులు చెల్లించ లేమని పలు గ్రామాల ప్రజలు, టీ డీపీ నాయకులు పేర్కొన్నారు. తా మంతా వ్యవసాయం, ఉపాధిహామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్నా మని, మున్సిపాలిటీలోకి తమ గ్రా మాల విలీనం ప్రక్రియను ఆపాలని వారు డిమాండ్ చేశారు.
రహదారులు సరిగా లేకపోవడంతో మండలపరిధిలోని పలు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బం దులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా ఎవరూ పట్టించుకున్న పాపనపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఎవరూ పట్టించుకో లేదు. అయితే కూటమి ప్రభు త్వం రాగానే గ్రామీణ రహదారులకు మోక్షం లభించింది.
ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలు, 156 మంది సిబ్బంది ఒక్కసారిగా తనిఖీలకు దిగడంతో ధర్మవరం దద్దరిల్లింది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ధర్మవరం, పెనుకొండ డీఎస్పీలు హేమంతకుమార్, నరసింగప్ప, సీఐలు, ఎస్ఐలతో కలిసి ఎస్పీ సతీష్కుమార్ బుధవారం సోదాలు నిర్వహించారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నేర చరిత్ర ఉన్నవారికి ఎస్పీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
మండలంలోని చిన్నూరుబత్తలపల్లి వరిపొలాల్లోకి రావులచెరువుకు వెళ్లే కాలువనీరు వెళుతుండటంతో సాగురైతులు ఇబ్బందులు పడుతున్నారు. రావులచెరువుకు ధర్మవరం చెరువు నుంచి నీరు విడుదల చేశారు. అయితే చెరువుకు వెళ్లే కాలువ గడ్డితో కుంచించిపోవడంతో కాలువలో నీరు సరిగ్గా వెళ్లక చిన్నూరుబత్తలపల్లి రైతుల వరి పొలాల్లోకి వెళ్లాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రానున్న మూడురోజుల పాటు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ సురేష్బాబు పేర్కొన్నారు. వారు బుధవారం ధర్మవరం చెరువుతో పాటు పోతుల నాగేపల్లి చిత్రావతి నది, రేగాటిపల్లి, గొట్లూరు చెరువులలో నీటి మ ట్టాన్ని పరిశీలించారు.
పోలీస్ స్టేషనకు వచ్చే ఫిర్యాదు దారుల పట్ట నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. స్థానిక పో లీస్ స్టేషనను మంగళవారం ఎస్పీ అకస్మిక తనిఖీ చేశారు. రి కార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. రాబో యే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు.
పోలీసు అమర వీరుల ఆశయాల స్ఫూర్తితో పునరంకితమవుదామని వనటౌన, టూటౌన సీఐలు నాగేంద్రప్రసాద్, రెడ్డప్ప పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పోలీస్స్టేషన ఎదుట ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి వారు సెల్యూట్ చేశారు.
పోలీసుల నిబం ధనలు తప్పక పాటించి విక్ర యాలు జరపాలని డీఎస్పీ హే మంతకుమార్ టపాసుల వి క్రయదారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్య లు తీసుకుంటామని హెచ్చరిం చారు. స్థానిక ప్రభుత్వ బా లుర ఉన్నతపాఠశాల క్రీడామై దానంలో టపాసుల దుకా ణా లు ఏర్పాటుచేసిన ప్రాంతాన్ని ఆయన ఆదివారం తన సిబ్బందితో కలిసి పరిశీలించారు.
కార్యకర్తలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ టీడీపీ సభ్యత్వం తీసుకున్నవారికి, బీమా సదుపాయం కల్పించం డం బాధిత కుటుంబాలకు ఓ వరంలా నిలుస్తోందని టీడీపీ ని యోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. ఇటీవల మం డలంలోని పోతుకుంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గుజ్జల ఆదినరసింహులు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. అతడికి టీడీపీ సభ్యత్వం ఉండటంతో పరిటాలశ్రీరామ్ చొరవతో పార్టీ కార్యాల యం నుంచి ప్రమాద బీమా రూ.5లక్షలు మంజూరైంది.
మండలంలోని చిగిచెర్ల గ్రామంలో శుక్రవారం ఉమ్మడి జిల్లాల జడ్పీ సీఈఓ శివశంకర్ పర్యటిం చారు. రోడ్డుపై మురుగునీటి నిల్వ, చెత్త దిబ్బలు ఉండటంతో... ఇలా ఉం టే రోగాలు రావా అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడుతూ... ఇళ్ల్ద నుంచి రోడ్డుపైకి నీరు వదలకూ డదని, ఇంటివద్దే సోపిట్ ఏర్పాటుచేసుకోవాలన్నారు.