Home » Dharmavaram
రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. ఆ యన బుఽధవారం పట్టణం లోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్కు రెండు తెలుగురాష్ట్రాలూ సమానమే అన్నారు.
కౌశల్ సైన్స రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణంలోని బీఎస్ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి చరణ్తేజ్ ఎంపికైనట్టు పాఠశాల హెచఎం మేరివరకుమారి తెలిపారు. కొత్తచెరువులో నవంబరు 27న జరిగిన కౌశల్ సైన్స ప్రతిభాన్వేషణ జిల్లా స్థాయి పోటీలలో చరణ్తేజ్ ప్రతిభ కనబరచినట్టు తెలిపారు.
ప్రధానమంత్రి అవాస్ యోజన(పీఎంఏవై2.0) పథకం కింద జియోట్యాగింగ్ చేయని వారికి ఈ నెల 14 వరకు అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవా లని టీడీపీ నియోజవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ సూచించారు. పీఎంఏవై 2.0పై స్థానిక ఎర్రగుంట టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని సచివాలయాల్లో గృహ నిర్మాణానికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
వైసీపీ నాయకులు కూటమి నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన ధర్మవరంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఒక్కో ఓవర్కు ఒక్కో పందెం కాస్తున్నారు. పట్టణంలోని క్రీడా మైదానంలో జరిగే పోటీలు బెట్టింగ్లకు అడ్డాగా మారాయనే విమర్శలొస్తున్నాయి. ఇక్కడ జరిగే మ్యాచ్లో కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఉంటాయి. వివరాలిలా ఉన్నాయి.
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని సోమవారం ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించారు. వైద్యాధికారులు, సిబ్బంది, మున్సిపాలిటీ, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మానవహారం ఏర్పాటుచేసి, ఎయిడ్స్పై అవగాహన కల్పించారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో ప్రతిపేద వాడి ముఖంలో ఆనందం కనిపిస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని 27వ వార్డు వైఎస్సార్ కాలనీలో ఎన్టీఆర్భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన అందజేశారు.
ధర్మవరం పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని నెలలుగా 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటకొచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో కేసు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.
విద్యార్థులలో భయాన్ని పొగొట్టేందుకే ఎనఎంఎంఎ్స మాదిరి పరీక్షను నిర్వహించినట్టు పాఠశాలల హెచఎంలు తెలిపారు. పట్టణంలోని బీఎ్సఆర్ బాలికల ఉ న్నతపాఠశాలలో ఎనఎంఎంఎ్స మాదిరి పరీక్షను ఆదివారం ఆంధ్రప్రదేశ స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన ఆధ్వర్యంలో రెడ్డి విఠల్ , జయచంద్రారెడ్డి సహకారంతో నిర్వహించారు.
రబీ సీజన వచ్చే సింది. సాగుకు వేళ అయింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వం ప్ర త్నామ్నాయ విత్తసాగు కోసం విత్తన ఉలవలను రాయితీతో మండలాని సరఫరా చేసింది. ఈ వర్షాలకు విత్తనాలను విత్తేందుకు రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం పంపీణీ చేసిన విత్తనాలను ఇప్పటివరకు ఒకటి రెండు గ్రామాల్లో తప్ప ఏ గ్రామంలోనూ పంపిణీ చేయలేదు