Home » Devotees
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వారా దర్శనాలు భక్తుల విశేష ఆదరణతో కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ ప్రత్యేక దర్శనాలకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెరిచిన వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీవారి కొండకు చేరుకుంటున్నారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీనివాసరావు దేవస్థానం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి సర్వదర్శనానికి తిరిగి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో, ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ భారీగా పెరిగింది.
యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్గా, ఆలయ ఈవోగా వెంకట్రావు అప్పట్లో పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.
శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం అందించే కార్యక్రమాన్ని ఇవాళ(మంగళవారం) ఘనంగా ప్రారంభించింది. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేశ్నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును సందర్శించనున్నారు. జనవరి మూడో తేదీన డిప్యూటీ సీఎం కొండగట్టుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు. ఈ ప్రత్యేక పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి ఆలయానికి ఆన్లైన్ సేవల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం క్షేత్రానికి తరలివచ్చారు.