Home » Devotees
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టమని తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. జగన్ హయాంలో కొంతమంది రాజకీయ నేతల అండదండలు చూసుకొని వేంకటేశ్వర స్వామివారి సొమ్ములు కాజేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
ఓంగోలు నగరంలోని తూర్పుపాలెంలో ఈ నరకాసురవధ కార్యక్రమం 1902వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పట్లో తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య అనే వ్యక్తి ఈ నరకాసురవధ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పెద్దలు చెబుతారు. ఆ ఆచారం తరాలు మారినా నేటికీ కొనసాగుతూనే ఉంది.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 2026 నూతన క్యాలెండర్ని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ఇవాళ(గురువారం) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవానీ దీక్షా విరమణల షెడ్యూల్ విడుదల చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర ఆలయానికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం వచ్చింది. దసరా నవరాత్రుల 11 రోజుల హుండీని మంగళవారం లెక్కించారు ఆలయ అధికారులు. 2025 దసరా హుండీ ఆదాయం రూ. 10.30 కోట్లు దాటింది.
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
తిరుమల శ్రీవారు మంగళవారం ఉదయం సూర్యప్రభమీద ఊరేగిన స్వామి, రాత్రి చంద్రప్రభపై విహరించాడు.
దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో కూటమి ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆలయాల్లో నాయీబ్రాహ్మణులకి ట్రస్టు బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తుచేశారు.
దుర్గామాతను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.శివకుమార్ తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం చాలా చక్కగా ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలంతా పండుగను ఘనంగా చేసుకోవాలని రేవంత్రెడ్డి, కేసీఆర్ ఆకాంక్షించారు.