Home » Deputy CM Pavan Kalyan
నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్లో పులి మరణించిన ఉదంతంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. పులిది సహజ మరణమా.. లేక వేటగాళ్ల దుశ్చర్య అనే కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో అత్తిలిలో లేస్, నేత కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 15 మందికి త్వరలోనే క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయనున్నారు.
సూపర్ ఎల్నినో సమయంలో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని.. కాలువల్లో పూడిక తీయడం, గట్లు లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు.
ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణపైనా ప్రభుత్వానికి బాధ్యత ఉందని, ఇదే దృక్పథంతో మానవ-ఏనుగుల సంఘర్షణలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం ప్రాంతంలో గుర్తించిన కొత్త రకం మొక్కకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘క్రో టన్ ఉబ్బలమడుగెన్సిస్’ అని నామకరణం చేశారు. తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో ఈ అరుదైన వృక్ష జాతి మొక్కను అటవీ అధికారులు గుర్తించారు.
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
కామన్వెల్త్ గేమ్స్-2026లో రజత పతకం సాధించిన వల్లూరి అజయ్ బాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు. స్వర్ణ పతకాన్ని అత్యంత స్వల్ప తేడాతో చేజార్చుకున్నా ఛాంపియన్గా నిలిచావని కొనియాడారు.
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేటి నుంచి ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
మానవాళికి మడ అడవులు మొదటి రక్షణ కవచమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంవో స్పష్టం చేసింది. అసాధారణ పర్యావరణ మార్పుల నుంచి తీర ప్రాంత ప్రజలను అవి కాపాడతాయని పేర్కొంది. మడ అడవుల పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.