Home » Delhi
తెలంగాణలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని ప్రి బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. RRR, హైదరాబాద్ మెట్రో ఫేజ్–2, PRLI జాతీయ ప్రాజెక్ట్ హోదా, విద్య–ఆరోగ్య రంగాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతితో సహా ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగానికి బదులుగా భూమిని స్వాధీనం చేసుకున్నట్టు బలమైన ఆధారాలున్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొంది.
పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చే భారీ వాహనాలు గంటల తరబడి టోల్ప్లాజాల వద్ద వేచి ఉండటం కూడా కాలుష్యానికి కారణం అవుతున్నందున వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని సుప్రీం కోర్టు సూచించింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం టీఎంసీ ఎంపీలు నిరసన చేపట్టారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అక్కడినుంచి పంపించారు..
దేశంలో కొంత కాలంగా పెరుగుతున్న వీధి కుక్కల దాడులు, కుక్క కాటు సంఘటనలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి కేంద్రీకరించింది. కోల్కత్తాలోని ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.
వైసీపీ నేత, రాజంపేట సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి 2014 నుంచి 2024 వరకు తన ఆస్తులకు సంబంధించిన వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆ వివరాలివీ...
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పశ్చిమ దేశాలు వ్యవహరించిన తీరును విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తప్పుబట్టారు. ఆపరేషన్ సిందూర్పై వచ్చిన రియాక్షన్స్ గురించి తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పశ్చిమ దేశాలు తమకు లాభం ఉంటే తప్ప ఏ పని చేయటం లేదని అన్నారు.
అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు 30 బుల్డోజర్లను, 50 డంప్ ట్రక్లను ఉపయోగించారు. రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను తొలగించారు. మసీదు విషయంలో మాత్రం దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు(బుధవారం) సాయంత్రం 3:30 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాత్రి డిన్నర్ మీటింగ్ చేస్తారు. తిరిగి 11:00 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడకు వస్తారు.