బాధ్యతారాహిత్యం..
ABN, Publish Date - Jan 09 , 2026 | 03:59 PM
పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చే భారీ వాహనాలు గంటల తరబడి టోల్ప్లాజాల వద్ద వేచి ఉండటం కూడా కాలుష్యానికి కారణం అవుతున్నందున వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని సుప్రీం కోర్టు సూచించింది.
న్యూఢిల్లీ, జనవరి 9: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యానికి కారణాలు కనిపెట్టనందుకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ను మంగళవారం నాడు సుప్రీంకోర్టు (Supreme Court) తప్పుబట్టింది. గ్యాస్ ఛాంబర్లా తయారైన ఢిల్లీని కాలుష్యం బారి నుంచి కాపాడాలన్న సంకల్పం ఈ సంస్థకు లోపించిందని.. కారణాలు, పరిష్కారాలతో రెండు వారాల్లోగా తన ముందు ఉండాలని కోర్టు గట్టిగా చెప్పింది. పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చే భారీ వాహనాలు గంటల తరబడి టోల్ప్లాజాల వద్ద వేచి ఉండటం కూడా కాలుష్యానికి కారణం అవుతున్నందున వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని కోర్టు సూచించింది.
ఇవి కూడా చదవండి..
అలాస్కా ట్రిప్.. మైనస్ 40 డిగ్రీల చలి.. తెలుగు విద్యార్థి అదృశ్యం
కేటీఆర్పై గజ్జెల కాంతం షాకింగ్ కామెంట్స్
Read Latest National News And Telugu News
Updated at - Jan 09 , 2026 | 04:23 PM