Home » Delhi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు(గురువారం) కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పైకి సాధారణ సమావేశంలాగే కనిపిస్తున్నా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఉచిత చికిత్స అందించే వ్యవస్థపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది.
ప్రభుత్వ భూములు రాయితీపై తీసుకున్న ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ఉచిత చికిత్సను అమలు చేయడానికి విధివిధానాలను రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్లో వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముగ్గురికీ కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.
ఏపీని భవిష్యత్తు న్యూక్లియర్ ఆర్థికవ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం తమ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రపంచ న్యూక్లియర్ ఎనర్జీ పరిశ్రమ కొత్త దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఇది కీలకంగా మారగలదని పేర్కొన్నారు.
దేశ రాజధానిలోని చరిత్రాత్మక చాంద్నీ చౌక్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ శివ నవగ్రహ ఆలయంలో జరిగిన సంచలన దొంగతనం కేసును ఉత్తర జిల్లా కోత్వాలీ పోలీసులు కేవలం నాలుగు రోజుల్లోనే చేధించారు.
విమానయాన సంస్థలకు భారీ ఊరట కలిగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్పై వ్యాట్ను భారీగా తగ్గించింది. ఏటీఎఫ్పై ప్రస్తుతం ఉన్న వ్యాట్ను 25 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది.
ఢిల్లీలో మరోసారి భారీ బంగారం స్కామ్ బయటపడింది. ఓ వ్యక్తి ప్యాంట్ జేబుల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు మూడున్నర కిలోల పసిడిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.