Home » Delhi
గత సోమవారం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఐ-20 కారు నుంచి విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. ఈ కేసు విచారిస్తున్న అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు
ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బాంబ్ బ్లాస్ట్ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సంఘటనా స్థలం దగ్గర తాజాగా మూడు 9 ఎమ్ఎమ్ కాట్రిడ్జ్లు దొరికాయి. వాటిలో రెండు లైవ్ కాట్రిడ్జ్లు కాగా.. మరొకటి ఖాళీ షెల్. బాంబు పేలిన చోటులోకి ఈ మూడు కాట్రిడ్జ్లు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర చోటుచేసుకున్న బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. ఉగ్ర డాక్టర్ల సంబంధాలు, లింకులపై విచారణ చేపట్టారు.
ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామాను ప్రజల చెవుల్లో పడలేదని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఓట్ల చోరీని ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఒక స్థానిక ఎన్నిక అని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ కారు పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన డాక్టర్ షాహీన్ సయీద్ కు పుల్వామా ఘటన సూత్రదారి భార్యతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
డిసెంబర్ 6న భారీ ఉగ్ర దాడికి ప్లాన్ జరిగింది అందుకోసమే ఈ 32 కార్లను కూడా ఉగ్రవాదాలు సిద్ధం చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఈ 32 కార్లతో ఢిల్లీతో సహా దేశంలోని పలు నగరాల్లో ఏకకాలంలో దాడుల కోసం ఉపయోగించాలని అనుమానిత ఉగ్రవాదులు భావించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు దాడుల కోసం ఐ20, ఎకోస్పోర్ట్ వంటి కార్లను ఎంపిక చేసుకుని.. వాటిని పేలుడు పదార్థాలను నింపేందుకు వీలుగా మాడిఫై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఉగ్రవాదులు నాలుగు కార్లతో బాంబు దాడులు చేయాలని కుట్ర చేశారు. ఉమర్ ఐ20 కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మిగిలిన మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భారత్, పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్ల వద్దని యూకే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీనగర్, పహల్గామ్, సోన్మార్గ్లో ఆదేశాలు పాటించాలని స్పష్టం చేశారు. ఢిల్లీలో బాంబు దాడికి పాల్పడిన వారిని వదిలి పెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు.
తుంగభద్ర డ్యామ్కు పోలీసులు పటిష్ట భద్రతను కల్పిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేగాక... పలు ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. సాయుధ పోలీసు బలగాలు ప్రాజెక్టు పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.