Home » Delhi
సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్భంధాలతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరని చెప్పుకొచ్చారు.
వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ జారీ చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రామాణిక వసతులు కల్పించాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది.
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది. అయినప్పటికీ వెనక్కు మాత్రం తగ్గటం లేదు. మిస్సైల్స్, డ్రోన్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడుతోంది.
ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా పని చేసే ఓ యువకుడు ఈజీ మనీ కోసం దొంగగా మారాడు. పగలు హోటల్లో పని చేస్తూ.. రాత్రిళ్లు దొంగతనాలు చేయటం మొదలెట్టాడు. ఓ ఇంట్లో దొంగతనం చేసిన అతడు చిన్న తప్పు కారణంగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
చనిపోవడానికి ముందు ముగ్గురు వ్యక్తులు సాయం కోసం కేకలు వేస్తున్న దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ముగ్గురు వ్యక్తులు సాయం కోసం బాల్కనీలోకి వచ్చి నిల్చుని ఉన్నారు. చావు భయంతో గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో బుధవారం పెను విషాదం చోటుచేసుకుంది. ఓ బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది సజీవదహనం అయ్యారు.
భారతీయ తపాలా శాఖ వినియోగదారుల కోసం కేంద్రం కొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యారంటీడ్ నెక్ట్స్ డే డెలివరీ సేవల్ని కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కుమార్తెకు ఎప్స్టీన్ ఫైల్స్లో సంబంధం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.
వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
కొంతకాలంగా ఢిల్లీలో కట్టెల పొయ్యిల వాడకంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిల వాడకానికి అధికారికంగా అనుమతి నిచ్చింది.