Home » Delhi
ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న ప్రధాని మోదీపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ను స్వీకరించడానికి మంగళవారం సుప్రీంకోర్టు నిరాకరించింది.
అతడు 110 రోజుల్లో 200సార్లు విమానాలెక్కి దేశమంతా తిరిగాడు. కానీ, అతడు పర్యాటక ప్రేమికుడు కాదు.. రాజకీయ నేత అంతకన్నా కాదు.. అతడో దొంగ. విమాన ప్రయాణికులతో కలిసిపోతాడు. విమానాశ్రయాల్లోనే వారితో మాటలు కలిపేస్తాడు. విమానం ఎక్కాక వారి పక్కనే తాను కూర్చునేలా సిబ్బందిని బతిమాలుకుంటాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి ఘటనలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ఆయన స్పందించకపోవడం సిగ్గు చేటు అని పేర్కొంది.
లోక్సభ ఎన్నికల్లో "మతపరమైన విభజన ప్రసంగాలు'' చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉల్లంఘించారని, ఆయనపై చర్యలకు ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అకతాయిల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. ఎయిర్ పోర్టులు, పాఠశాలలు, ఆసుపత్రులకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో ఆ సమయంలో సదరు సంస్థల సిబ్బంది పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లఖ్నవూలోని గోమతి నగర్లో పలు పాఠశాలలకు సోమవారం ఉదయం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
న్యూఢిల్లీలోని బురారీ, సంజయ్ గాంధీ ఆసుపత్రులకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్ టీం ఆ యా ఆసుపత్రులకు చేరుకున్నాయి.
భారతీయ జనతా పార్టీపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్లో తమ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద విడుదలయిన సంగతి తెలిసింది. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ను కలిశారు.
పాకిస్థాన్ సరిహద్దు వెంబడి నిఘాను పెంచే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. భారత ఆర్మీ, నేవీ కోసం దృష్టి-10 డ్రోన్గా పిలిచే నాలుగు హార్మెస్- 900 స్టార్లైనర్ డ్రోన్లను కొనుగోలు చేసింది.
ప్రముఖ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్కు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషి్పను ప్రదానం చేసిం ది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్య క్షుడు మాధవ్ కౌశిక్, కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు శనివారం ముస్సోరిలో రస్కిన్ బాండ్ నివాసానికి వెళ్లి ఈ ఫెలోషి్పను అందజేశారు.
దేశవ్యాప్తంగా మూడు దశల ఎన్నికలు ముగిశాయి.. సగం పైగా స్థానాల్లో పోలింగ్ అయిపోయింది..! మరి.. రాజకీయ వాతావరణం ఎలా ఉంది? బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిపై ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడునుందా? కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గాలి వీస్తోందా? దీనిపై ఆ రెండు పక్షాలు తమతమ వాదనలు వినిపిస్తున్నాయి.