Home » Delhi
పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది.
దేశ రాజధానిలో నిరసనలకు ప్రధాన వేదికగా ఉన్న జంతర్ మంతర్ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయాలని ఎందుకు ఆలోచించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. నగరం నడిబొడ్డున జరిగే ఆందోళనలతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మొత్తం నగరాన్ని అనవసరంగా బందీగా మార్చే పరిస్థితి ఉండకూడదని జస్టిస్ అమిత్ మహాజన్ వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ఎంపీలతో శుక్రవారం నిర్వహించిన అల్పాహారం కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుగుబాటు ఎంపీలకు తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.
దేశ రాజధాని ఢిల్లీలో రేపు (బుధవారం) జరగనున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వర్చువల్ మీడియా సమావేశంతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
థాయ్లాండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో తీవ్ర గాలిపోటు (టర్బులెన్స్) ఏర్పడింది. ఈ ఊహించని పరిణామంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడగా, విమానం కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసానికి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం మార్చ్ చేపట్టారు. వందమందితో ప్రధాని నివాసానికి మార్చ్ చేపట్టిన్నట్లు ప్రకటించారు.
మెటా గ్లోబల్ బృందానికి కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5, 6వ తేదీల్లో విచారణకు రావాలని ఆదేశించింది.
అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టేట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్, మాజీ డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్లను లైంగిక వేధింపుల కేసులో కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల నిర్వహణపై సోమవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. నిరసనల నిర్వహణకు జంతర్ మంతర్ సరైన ప్రదేశం కాదంటూ సతీష్ చంద్ కౌశిక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.