Home » Delhi
ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్ పాకెట్ 1 మెట్రో స్టేషన్ పేరు మార్చారు. 'శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్'గా పేరు పెట్టారు. మెట్రో స్టేషన్ పేరు మార్చినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
జన్ సురాజ్ పార్టీ వేసిన పిటిషన్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్ను విచారించడానికి అంగీకరించలేదు.
ప్రధాని అధికారిక నివాసంలో దేశంలోని దేవ్మోగ్రా, కోయంబత్తూర్, రాయ్పూర్, గువాహటి, ఢిల్లీ నుంచి ఎంపికైన ఎగ్జామ్ వారియర్స్.. మోదీతో ముచ్చటించారు. సుమారు 4.50 కోట్ల మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని 15 నిమిషాలు ప్రసంగించారు.
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కిందపడిపోయారు. బుధవారం నాడు పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. అయితే..
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ట్రాన్స్జెండర్ రెచ్చిపోయి ప్రవర్తించింది. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ యువతి ముఖంపై గుట్కా ఉమ్మేసింది. ట్రాన్స్జెండర్.. యువతిపై గుట్కా ఉమ్మేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారత్, అమెరికా మధ్య జరిగి వాణిజ్య ఒప్పందాన్ని(ట్రేడ్ డీల్) 'ఈ శతాబ్దపు అతిపెద్ద ఒప్పందం'గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారత దేశ ప్రాముఖ్యత మరింత పెంచుతుందని తెలిపారు.
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు.
బీఆర్ఎస్ భవన్ దగ్గరకు కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన కెమెరా జర్నలిస్ట్ పవన్పై బీఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
దేశ అభివృద్ధిలో రాజీ పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. రూ.53 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ఉందని పేర్కొన్నారు..