Home » Damodara Rajanarasimha
ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి హాస్టల్, మెస్ పేరుతో అదనపు ఫీజుల వసూళ్లపై నిఘా పెంచాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు, యాజమాన్యాల తీరుపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
చికిత్స మధ్యలో రోగులను డిశ్చార్జి చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శాఖ అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజారోగ్యానికి ఇబ్బంది తలెత్తకుండా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు(డీఎం అండ్ హెచ్ఓ) అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదలు వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు దామోదరరాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, ధనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలోని ఈర్లపల్లి తండాకు చెందిన రవినాయక్ మృతికి సకాలంలో చికిత్స అందకపోవడమే కారణమని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, విచారణ జరిపించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.
వైద్య ఆరోగ్య శాఖలో మరోసారి కొలువుల జాతర జరగబోతోంది. ఏకంగా 1,623 స్పెషలిస్టు డాక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది.
ఔషధాల విషయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు
డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ అప్గ్రేడేషన్ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన మందులు, క్వాలిటీ ఫుడ్ అందించే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
ప్రైవేటు అంబులెన్స్ల దోపిడీకి చెక్ పెట్టాలని సర్కారు భావిస్తోందా..? వాటి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసి.. నియంత్రణలోకి తేవాలని చూస్తోందా..
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది.