Home » Damodara Rajanarasimha
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ - జోగిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha) కుమార్తె త్రిషతో కలిసి 196వ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఉగాది పర్వదినం నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీకి రాజ పూజ్యం 16 ఉంటే.. అవమానం 2 ఉందని చెప్పారు. తాను పీసీసీ అధ్యక్ష పదవి అడగడం కొత్తేమి కాదన్నారు. అయితే అవకాశం వచ్చిన ప్రతీ సారి తాను పీసీసీ పీఠం అడుగుతానని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత ఊరురా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) అన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలోనే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.
ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సబ్ ప్లాన్ వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
కాంగ్రెస్ ట్యాగ్ లైన్ స్వేచ్ఛ, ఆత్మగౌరవం, ఉపాధి అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) తెలిపారు. శుక్రవారం నాడు ధర్మపురిలో మంత్రి రాజనర్సింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు.
Andhrapradesh: సోషల్ మీడియాలో సెలబ్రిటీల అకౌంట్స్ను హ్యాక్ చేయడం కేటుగాళ్లకు పరిపాటిగా మారిపోయింది. ఇటీవల పోలీస్శాఖ ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అవడం సంచలనంగా మారగా.. ఇప్పుడు తాజాగా ఓ మంత్రి ఫేస్బుక్ పేజ్నే హ్యాక్ చేశారు కేటుగాళ్లు.
ప్రైమరీ హెల్త్ సెంటర్ల (PHC) ను బలోపేతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ ( Minister Damodara Rajanarsimha ) తెలిపారు. మంగళవారం నాడు హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.