Home » Crude Oil
అంతర్జాతీయ ముడి చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నామని, ఏ నౌక అయినా దాటడానికి ప్రయత్నిస్తే కాల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకదళం ఆ పని చేస్తాయని వార్నింగ్ ఇచ్చింది.
అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజాగా సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీ కంపెనీపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ ఇది స్వల్పకాలికమేనన్న కథనాలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో చమురు దిగుమతుల పరంగా భారత్కు టెన్షన్ లేనట్టేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వారం వారం ఏ మేరకు రష్యా, యూఎస్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నారో చెప్పాలని కేంద్రం రిఫైనరీలను కోరినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరనుందన్న వార్తల నడుమ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్నెఫ్ట్, లోకోయిల్పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంక్షలు అమల్లోకి రావడంతో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి.
Discount On Oil: అమెరికా నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా .. భారత్ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. క్రూడ్ ఆయిల్ దిగుమతిని కొనసాగించింది. ఇప్పుడు రష్యా ప్రకటించిన డిస్కౌంట్తో తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకోనుంది.
OPEC+ Oil Supply Hike August: చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్+) శనివారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 548,000 బ్యారెళ్లకు పెంచేందుకు సమిష్టిగా అంగీకారం తెలిపాయి.
హార్ముజ్ జలసంధిని మూసేస్తామన్న ఇరాన్ హెచ్చరికలతో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఆసియా దేశాల్లో మార్కెట్ సూచీలు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అన్నంత పని చేశాడు. టారిఫ్ పెంపు, ప్రతీకార సుంకాల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెర తీశాడు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల విదేశాల మీద ఎంత ప్రభావం ఉంటుందో తెలియదు కానీ.. అమెరికన్ల మీద మాత్రం భారీగా ప్రభావం పడనుంది అంటున్నారు నిపుణులు. తాజా సుంకాల వల్ల కొన్నింటి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
మీకు భారత్ ఎన్ని దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుందో తెలుసా. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఈ అంశంపై కేంద్ర మంత్రి కీలక విషయాలను వెల్లడించారు.