Home » Crude Oil
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. దేశంలో ఇంధన సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
గృహ వినియోగదారుల కోసం 10 కేజీల ఎల్పీజీ గ్యాస్తో సిలిండర్లను సరఫరా చేసే అంశాన్ని ఆయిల్ సంస్థలు పరిశీలిస్తున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర పెట్రోలియం శాఖ ఖండించింది. అవన్నీ ఊహాగానాలేనని, అలాంటి ఆలోచనలేం లేవని స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అమెరికా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రష్యా ముడిచమురుపై అమెరికా సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురుపై కూడా ఆంక్షలు ఎత్తేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.
ప్రపంచ ముడి చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడి నేపథ్యంలో ఈ జలసంధిని ఇరాన్ ఇప్పటికే బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో యుద్ధానికి సంబంధించి పలు వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు ట్యాంకర్ అక్వా టైటాన్ దిశ మార్చుకుని భారత్ వైపు వెళ్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దక్షిణ చైనా సముద్ర జలాల్లో అది దిశ మార్చుకుందని సమాచారం.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ముడి చమురు గురించిన చర్చే. ఈ నేపథ్యంలో అసలు ముడి చమురు ఎన్ని రకాలో, దీన్ని ఎలా వర్గీకరిస్తారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక నిల్వల నుంచి చమురు విడుదల చేయాలని ఐఈఏ భారత్ను కోరింది. అయితే దేశీయ అవసరాలకే ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ భారత్ ఈ అభ్యర్థనను తిరస్కరించినట్టు సమాచారం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మనదేశ నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్, ఎరువుల దిగుమతులకు ఆటంకం ఏర్పడడంతో, అతి త్వరలోనే వీటి నిల్వలు నిండుకుంటాయని భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు భారత్కు అనుమతి ఇస్తున్నట్టుగా అమెరికా ఇటీవల ప్రకటించింది. దీనిపై అమెరికా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందని పలువురు విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా భారతీయ అమెరికన్లు ఎందుకు నోరు మెదపట్లేదని నిలదీస్తున్నారు.