Home » Crime
గచ్చిబౌలిలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. గచ్చిబౌలి TNGO'S కాలనీలో వికారాబాద్ జిల్లా యాలల ప్రాంతానికి చెందిన బోయిని పరమేశ్వర్ నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలి నానక్ రామ్ గూడాలోని ప్రభుత్వ పాఠశాలలో బోయిని పరమేశ్వర్ ఇద్దరు కుమారులు చదువుతున్నారు.
డీజే సౌండ్ దెబ్బకు భారీ గోడ కూలడంతో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం భవానీపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది.
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో స్వీట్ షాపులపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని 43 స్వీట్ షాప్స్ లో 3 రోజుల పాటు అధికారులు ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గడువు ముగిసిన పదార్థాలు స్వీట్ల తయారీలో వాడుతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాప్ లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదని అధికారులు తెలిపారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్)లో దారుణం జరిగింది. ఆస్తి పంపకాలతో తల్లి అంత్యక్రియలు కూతుళ్లు ఆపేశారు. కొంతకాలంగా అక్కా, చెల్లెళ్ల మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే తల్లి చనిపోగా ఏకంగా మూడు రోజులుగా తల్లి అంత్యక్రియలు ఆపేశారు.
వరంగల్ నల్లబెల్లి మండలం కొండాపురంలో గురువారం మరో దారుణం జరిగింది. అన్నపై తమ్ముడు ఘోరంగా కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన వదినపై సైతం కత్తితో దాడి చేశాడు. అన్న రమేశ్పై తమ్ముడు మేరుగుర్తి సురేశ్ కత్తితో దాడి చేశాడు.
తెలుగులో తొలి నేపథ్య గాయని బాల సరస్వతి(97) మృతి చెందారు. హైదరాబాద్లో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆరేళ్ల వయసు ఉన్నప్పటినుంచే బాల సరస్వతి పాటలు పాడడం మొదలుపెట్టారు.
గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో ఇవాళ దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగుడు స్కూటీపై మాస్క్ వేసుకొని వచ్చి హత్య చేసి పరార్ అయినట్టు స్థానికులు చెబుతున్నారు.
జార్ఘండ్ రాజధాని రాంచీలోని రతు ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక తన కుటుంబంతో నివాసం ఉంటుంది. అయితే ఆదివారం ఆ బాలికపై కామాంధులు కాటేశారు. రాత్రి సమయంలో 9 మంది వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్ర శివారు ఖమ్మం - వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో అక్కడనున్న స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మెదక్ జిల్లా జానకంపల్లి పంచాయతీ సమీపంలోని ఒక తండా నుంచి కూలీ పని కోసం ఓ మహిళ మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చింది. కూలీ పని ఉందని నమ్మించిన దుండగులు.. కోల్పారం మండలం అప్పాజిపల్లి శివారు ఏడుపాయల రోడ్డు వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.