Home » Crime News
థాయ్లాండ్లో ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసి వారి కుటుంబాల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు భారతీయులను థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్లోని ఖ్లోంగ్ టాన్ ప్రాంతంలోని ఓ హోటల్ నుంచి దేశం విడిచి పారిపోవడానికి యత్నిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
భార్య, అత్తమామల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో అడ్డు వచ్చిన మూడేళ్ల కుమారుడిని ఓ తల్లి కడతేర్చింది.
చదువులో ప్రతిభ... సీఎం ప్రశంసలు... ముందు కనిపిస్తున్న ఉజ్వల భవిష్యత్తు! అయితే ఇంతలోనే ముర్రం శివాని ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? ఆ బాలిక ఆత్మహత్య వెనుక అసలు కారణమేంటి? ఇప్పుడు ఇదే ప్రశ్నకు సమాధానం కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తూ లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఏడాది వయసున్న చిన్నారి ఉండటం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది.
రాజస్థాన్లోని జైసల్మేర్లో విషాదం చోటుచేసుకుంది. అక్కడి ఓ వాటర్ ట్యాంక్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే..
డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ యువకుడు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే కారుతో దూసుకెళ్లిన ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ కాలుకు తీవ్ర గాయాలు కాగా, ఇన్స్పెక్టర్తో పాటు మరో కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ భర్త.. 8 నెలల గర్భిణీ అయిన భార్యను అత్యంత ఘోరంగా నరికి చంపేశాడు. కన్న బిడ్డల ముందే భార్యను కడతేర్చాడు ఆ కసాయి భర్త.
పని మనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దని నగర వాసులకు హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్చరిక. గత రెండేళ్లలో నగరంలో 565 సర్వెంట్ థెప్ట్ కేసులు నమోదయ్యాయని, అందులో 65 గ్రేవ్, 500 నాన్, గ్రేవ్ కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.