Home » Cricket
అండర్ 19 ఆసియా కప్నకు సంబంధించి తాజాగా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇందులో సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. కాగా ఆయుష్ మాత్రే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
డబ్ల్యూపీఎల్ 2026 సంబంధించిన మెగా వేలం ఢిల్లీ వేదికగా మొదలైంది. ఈ మెగా ఆక్షన్ను మల్లికా సాగర్ నిర్వహిస్తున్నారు. ఈ లైవ్ అప్డేట్స్ మీ కోసం..
డబ్ల్యూపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మను కొనుగోలు చేయడంలో పెద్ద హైడ్రామానే నడిచింది. దీప్తి కోసం ఢిల్లీ, యూపీ పోటీ పడగా.. ఆర్టీఎం కార్డ్ ద్వారా యూపీ రూ.3.20కోట్లకు సొంతం చేసుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్.. జనవరి 9 నుంచి ప్రారంభం కానున్నట్లు గురువారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ మెగా టోర్నీ కొనసాగనున్నట్లు తెలిపింది. మరోవైపు ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ డబ్ల్యూపీఎల్ వేలంలో అన్సోల్డ్ అయింది.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆసీస్- ఇంగ్లండ్ జట్లు పెర్త్ వేదికగా తొలి టెస్టులో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఆట కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. తాజాగా పెర్త్ పిచ్కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.
మహిళల బిగ్బాష్ లీగ్కు స్టార్ బ్యాటర్ జెమీమా దూరమైనట్టు బ్రిస్బేన్ హీట్ జట్టు సీఈవో వెల్లడించారు. ఆమె స్నేహితురాలు స్మృతి మంధానకు తోడుగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. గంభీర్కు బీసీసీఐ మద్దుతుగా నిలిచింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. గత వారంలో టాప్ ప్లేస్కు వచ్చిన డారిల్ మిచెల్.. ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయాడు.
సౌతాఫ్రికాతో వైట్వాష్కు గురయ్యాక టీమిండియా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్లో మరింత కిందకి దిగజారింది. నాలుగో స్థానంలో ఉన్న భారత్.. ఈ ఓటమి తర్వాత ఐదో స్థానానికి పడిపోయింది. మన కంటే ముందు స్థానంలో పాకిస్తాన్ జట్టు కొనసాగుతోంది.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా సొంతగడ్డపై వైట్వాష్కు గురైంది. ఈ నేపథ్యంలో తప్పు ఎవరిది? అనే చర్చ మొదలైంది. నెలల వ్యవధిలోనే టీమిండియా సిరీస్లు ఓడిపోవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రధాన కోచ్ గంభీర్ దీనికి కారణమనే చర్చ నడుస్తోంది.