Home » Cricket
భారత స్టార్ స్పిన్నర్ శ్రీ చరణి ఇటీవల ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్గా అవతరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతానికి తన దృష్టంతా టీ20 ప్రపంచ కప్ గెలవడంపైనే ఉందని స్పష్టం చేసింది.
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే తాజాగా బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన వీడియో మాత్రం క్రికెట్ ప్రియులను ఖుషీ చేస్తోంది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ దుమ్మురేపాడు. అఫ్గానిస్థాన్తో ఇటీవల ముగిసిన మూడు మ్యాచుల వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన గిల్ బ్యాటింగ్ విభాగంలో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకుకు చేరుకున్నాడు.
మహిళల క్రికెట్లో భారత యువ స్పిన్ సంచలనం శ్రీ చరణి సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న ఆమె.. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా మెక్కల్లమ్ స్పందించాడు.
మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ఓ కీలక ముందడుగు వేసింది. ప్రసవం తర్వాత కూడా మైదానంలోకి అడుగుపెట్టేందుకు ‘రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ’ గైడ్లైన్స్ను రూపొందించింది. ఐసీసీ ప్రకటించిన ఈ మార్గదర్శకాలను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వాగతించాడు.
జార్ఖండ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రాంచీలోని జేఎస్సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ బీసీసీఐకి పలు కీలక సూచనలు చేశాడు. ఇటీవల అఫ్గానిస్థాన్తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్ల్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గావస్కర్ పలు అంశాలను ప్రస్తావించాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత జట్టులో అతడు స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా వైభవ్ టీమిండియా జెర్సీని అందుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు జూన్ 26 నుంచి రెండు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్లో పర్యటించనుంది. భారత యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు.