Home » Cricket
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోయి వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. పిచ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్కు సిద్ధమయ్యాయి. మరి రాంచి పిచ్ ఎలా ఉండనుందనే సందేహం మొదలైంది.
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ.. ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. మరో మూడు సిక్సులు కొడితే అత్యధిక సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. సఫారీలతో తొలి వన్డేలో ఈ ఫీట్ అందుకునే అవకాశం ఉంది.
రాంచి వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. దీనిపై సఫారీల కెప్టెన్ బవుమా స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రావడం.. కెప్టెన్ రాహుల్కు బలమని పేర్కొన్నాడు.
సౌతాఫ్రికా-భారత్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కెప్టెన్గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టాడు. 2022లో రాహుల్ కెప్టెన్సీలో ఫామ్ అందుకుని వరుసగా సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ .. ఈ సిరీస్లో మళ్లీ అదే రికార్డు తిరగరాయనున్నాడా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది.
స్వదేశంలో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. నవాజ్, షహీన్, అబ్రార్ అహ్మద్ బౌలింగ్ ధాటికి శ్రీలంక 114కి కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో పాక్ నాలుగు వికెట్లు కోల్పోయి.. లంకపై 6 వికెట్ల తేడాతో గెలిచింది.
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ విషయంలో వారి నుంచి స్పష్టత తీసుకోవడం, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో రిషభ్ పంత్ తుది జట్టులో తప్పకుండా ఆడతాడని కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ తీసుకుంటాడా? లేక తానే కొనసాగుతాడా? అనే విషయంపై ఆదివారం స్పష్టత వస్తుందని చెప్పాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నానని, త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తానన్న నమ్మకం ఉందని స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తెలిపాడు. 150 కిమీ వేగంతో ఎవ్వరూ బౌలింగ్ చేయలేరని.. దానికి ఎంతో ధైర్యం కావాలని అన్నాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఈ షూట్లో పంత్ చేసిన వ్యాఖ్యలు అందరికీ నవ్వు తెప్పించాయి.
సౌతాఫ్రికాతో స్వదేశంలోనే రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత భారత జట్టుపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఈ విషయంపై స్పందించారు.