Home » Cricket
భారత మహిళా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం వేదికగా నమీబియా-యూఎస్ఏ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన అమెరికా జట్టు చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని పిచ్ శాసించనుంది. మైదానంలో పరిస్థితులే కీలకం కానున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగి ఈ మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఆది నుంచి పాక్పై భారత్దే ఆధిపత్యం. సచిన్, ధోనీ, విరాట్ కోహ్లీ ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్.. నాయకత్వంలో టీమిండియా అజేయంగా నిలుస్తూ వస్తోంది. కానీ టీ20 క్రికెట్లో ఒకే ఒక్క మ్యాచ్లో పాక్ విజయం సాధించింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్ పోరులో టీమిండియా విజయ కేతనం ఎగురవేస్తుందని తెలిపాడు.
టీ20 వరల్డ్కప్ 2026 నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లపై కఠిన నియమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన గర్ల్ఫ్రెండ్ మహిక శర్మతో కొలంబోలోని హోటల్ లాబీలో కనిపించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా ఐర్లాండ్-ఒమన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు సాధించింది.
2003 మార్చి 1.. సచిన్ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఓ రోజు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్లో సచిన్ ఆడిన నాక్.. చరిత్రలో నిలిచిపోయింది. కేవలం 75 బంతుల్లోనే 98 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి.. భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
భారత క్రికెట్లో సంచలనం సృష్టిస్తోన్న యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నవాడు. బిహార్లోని సమస్తిపుర్లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైభవ్.. పరీక్షలకు హాజరుకానున్నాడు.