Home » Cricket
భారత్-న్యూజిలాండ్ జట్లు శనివారం తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో తలపడనున్నాయి. ఈ ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆఖరి పోరులో గెలిచి.. రానున్న టీ20 ప్రపంచ కప్ 2026ను ఘనంగా ప్రారంభించాలని టీమిండియా భావిస్తోంది.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ పరంగా సూర్యకు రావాల్సినంత క్రెడిట్ రావడం లేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్గా సూర్యకు అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ.. బ్యాటర్గా రాణించాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. దీంట్లో స్టార్ ప్లేయర్లు చోటు దక్కించుకోలేకపోయారు. పాట్ కమిన్స్, స్మిత్ జట్టుకు దూరం కాగా.. మిచ్ మార్ష్ ఆసీస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ జట్లు వడోదర వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన గుజరాత్ బ్యాటర్లు రాణించారు. నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అయితే భారత్తో జరిగే మ్యాచులను పాక్ బహిష్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా వడోదర వేదికగా గుజరాత్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ముంబై ఫీల్డింగ్ చేయనుంది.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియా బి జట్టుపై సాధించిన విజయంపై ఆయన చేసిన ట్వీట్ను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ విషయంపై స్పందించాడు.
న్యూజిలాండ్తో ఆఖరి టీ20 ఆడడానికి టీమిండియా తిరువనంతపురం చేరుకుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో టీమిండియా ప్లేయర్ల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ సమీపిస్తోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో.. రీప్లేస్మెంట్గా ఐసీసీ స్కాట్లాండ్ను ఎంపిక చేసింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు.
ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు క్రికెట్ను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది.